అంబేద్కర్ స్పూర్తిని కొనసాగించాలి: చంద్రబాబు

By narsimha lodeFirst Published Apr 14, 2019, 11:21 AM IST
Highlights

రాజ్యాంగ వ్యవస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.
 


న్యూఢిల్లీ:  రాజ్యాంగ వ్యవస్థలను మోడీ సర్కార్ నిర్వీర్యం చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు ఆరోపించారు.

ఆదివారం నాడు  ఏపీ సీఎం చంద్రబాబునాయుడు  న్యూఢిల్లీలోని ఏపీ భవన్‌లో  నిర్వహించిన అంబేద్కర్ జయంతి ఉత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఆయన నివాళులర్పించారు..ఓటుతోనే సమాజంలోనే మార్పు వస్తోందన్నారు. అణుబాంబు కంటే అత్యంత శక్తివంతమైంది ఓటు అని బాబు అభిప్రాయపడ్డారు.

ఫారం-7  ద్వారా ఏపీ రాష్ట్రంలో 7 లక్షల ఓట్లను తొలగించేందుకు ప్రయత్నించారన్నారు.  బ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు నిర్వహించాలని  చంద్రబాబునాయుడు డిమాండ్ చేశారు.

పేదల జీవన ప్రమాణాలు పెరగాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు..అంబేద్కర్ ఏ ఆశయం కోసం రాజ్యాంగాన్ని రాశారో...ఆ స్పూర్తి కొనసాగాలని ఆయన అభిప్రాయపడ్డారు.రాజ్యాంగ వ్యవస్థలను కేంద్రం  నిర్వీర్యం చేస్తోందని ఆయన అభిప్రాయపడ్డారు.

click me!