తిరుపతిలో చంద్రబాబు ప్రచారసభలో రాళ్లు విసిరిన దుండగులు: రోడ్డుపై బైఠాయింపు

Published : Apr 12, 2021, 08:05 PM ISTUpdated : Apr 12, 2021, 09:32 PM IST
తిరుపతిలో చంద్రబాబు ప్రచారసభలో రాళ్లు విసిరిన దుండగులు: రోడ్డుపై బైఠాయింపు

సారాంశం

తిరుపతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.  బాబు ప్రచారం నిర్వహిస్తున్న వాహనం లక్ష్యంగా చేసుకొని  రాళ్లు విసిరారు.  


అమరావతి: తిరుపతిలో టీడీపీ చీఫ్ చంద్రబాబునాయుడు ఎన్నికల ప్రచార సభలో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లు విసిరారు.  బాబు ప్రచారం నిర్వహిస్తున్న వాహనం లక్ష్యంగా చేసుకొని  రాళ్లు విసిరారు.ఈ రాళ్లదాడిలో ఓ మహిళకు, యువకుడికిగా గాయాలయ్యాయని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి.  తనపై  జరిగిన రాళ్ల దాడికి సంబంధించిన రాళ్లను చంద్రబాబునాయుడు సభలో చూపించారు. ఆ తర్వాత ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఆయన ఈ విషయమై ఫిర్యాదు చేశారు. 

ఈ ఘటనను నిరసిస్తూ చంద్రబాబునాయుడు ప్రచార వాహనం వద్ద రోడ్డుపై బైఠాయించి నిరసనకు దిగారు. చంద్రబాబునాయుడును నిరసన వద్దని పోలీసులు కోరారు.జడ్ ప్లస్ కేటగరి రక్షణ ఉన్న  తనకే భద్రత కల్పించలేని  తనకు రక్షణ కల్పించలేని మీరు సామాన్యులకు ఏం రక్షన కల్పిస్తారని ఆయన పోలీసులను ప్రశ్నించారు. 

పోలీసుల తీరుపై ఆయన తీవ్రంగా మండిపడ్డారు. ఇది పిరికిపందల చర్యగా ఆయన పేర్కొన్నారు. పోలీసుల వైఫల్యం వల్లే ఇదంతా జరిగిందని బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని చంద్రబాబు పోలీసులను కోరారు. ఈ ఘటనను నిరసిస్తూ సీఎం డౌన్ డౌన్ అంటూ టీడీపీ కార్యకర్తులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Nara Lokesh: కోట్లు విలువైన ఇంజెక్షన్ ఇచ్చి చిన్నారి ప్రాణాలు కాపాడిన మంత్రి లోకేష్| Asianet Telugu
CM Chandrababu Naidu Rally మహిళా బిల్లును అడ్డుకోవడం మహిళలకు ద్రోహం సీఎం ర్యాలీ| Asianet News Telugu