Pawan Kalyan: వైజాగ్ స్టీల్ ప్లాంట్ విష‌యంలో పవన్ ఎలాంటి లేఖ రాయ‌లేదు !

By Mahesh RajamoniFirst Published Dec 12, 2021, 8:22 AM IST
Highlights

Pawan Kalyan:  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కార్మికులు చేస్తున్ననిర‌స‌న‌లు 300 రోజుల‌ను దాటాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అంటూ ఉద్య‌మాన్ని ఉధృతం చేయ‌డానికి కార్మికులు సిద్ధ‌మయ్యారు. దీనికి ప‌వ‌న్ క‌ళ్యాణ్ నేతృత్వంలోని జ‌న‌సేన సైతం మ‌ద్ద‌తు తెలిపింది, జ‌న‌సేనాని కేంద్ర ప్ర‌భుత్వాన్ని లేఖ సైతం రాసిన‌ట్టు ఆ పార్టీ పేర్కొంది. అయితే, Visakha Steel Plant విష‌యంలో ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి లేఖ‌లు రాయ‌లేద‌ని కేంద్రం వెల్ల‌డించింది. 
 

Pawan Kalyan:  వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు  వ్య‌తిరేకంగా ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో నిర‌స‌న‌లు ఉధృతం అవుతున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హ‌క్కు అనే నినాదంతో ముందుకు సాగుతున్న కార్మిక సంఘాలు నేటి నుంచి ఈ ఉద్య‌మాన్ని రాష్ట్రవ్యాప్తంగా ఉధృతం చేసేందుకు సిద్ధ‌మైంది. జ‌న‌సేన పార్టీ సైతం ఆదివారం నాడు విశాఖ ఉక్కు ప్యాక్ట‌రీ ప్ర‌యివేటీక‌ర‌ణ‌ను వ్య‌తిరేకిస్తూ పోరాటానికి సిద్ధ‌మైంది. దీనిలో భాగంగా గుంటూరు జిల్లా మంగళగిరిలో పవన్ కల్యాణ్ ఆదివారం నాడు 'విశాఖ ఉక్కు పరిరక్షణ దీక్ష‌కు దిగ‌నున్నారు. ఈ నేప‌థ్యంలోనే కేంద్ర ప్ర‌భుత్వం సంచ‌ల‌న విష‌యం బ‌య‌ట‌పెట్టింది. విశాఖ ఉక్కువిషయంలో జనసేన పార్టీ అధినేత పవన్‌ కళ్యాణ్ ఎలాంటి లేఖ‌లు రాయ‌లేద‌ని వెల్ల‌డించింది. 

Also Read: Modi Twitter Account Hacked: ప్రధాని నరేంద్రమోడీ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ Visakha Steel Plant విశాఖ ఉక్కు ప్యాక్ట‌రీ గురించి ఎలాంటి లేఖలు రాయ‌లేద‌ని కేంద్ర ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. ప‌వ‌న్ క‌ళ్యాణ్ రాసిన ఉత్త‌ర‌, ప్రత్యుత్తరాల విషయంలో ప్రధాన సమాచార కమిషనర్‌ వద్ద ఉన్న రికార్డులలో ఎటువంటి సమాచారం లేదని కేంద్ర ఆర్థిక శాఖ స్ప‌ష్టం చేసింది.  విశాఖ ఉక్కు ప్యాక్ట‌రీ  పెట్టుబడుల ఉపసంహరణ విషయంలో సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి, ప్రతిపక్ష నేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌లకు ఇచ్చిన ప్రత్యుత్తరాలపై సమాచారం కావాలని విజయవాడకు చెందిన ఇనగంటి రవికుమార్‌ సమాచార హక్కు చట్టం కింద గత నవంబర్‌లో కేంద్ర ఆర్థిక శాఖను కోరారు. దీనికి సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ పై విరాల‌ను వెల్ల‌డించింది. ప‌వ‌న్ ఎలాంటి లేఖ‌లు రాయ‌లేద‌ని పేర్కొనడంతో Visakha Steel Plant అంశంలో సీఎం వైఎస్‌ జగన్, ప్రతిపక్ష నేత చంద్రబాబులకు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, అప్పటి సహాయమంత్రి అనురాగ్‌సింగ్‌ ఠాకూర్‌ బదులిచ్చారని ఆ శాఖ అండర్‌ సెక్రటరీ పేర్కొన్నారు. 

Also Read: up assembly elections 2022: విద్యార్థుల‌కు ఉచితంగా టాబ్లెట్లు, స్మార్ట్ ఫోన్‌లు !

ఇదిలావుండ‌గా, విశాఖ ఉక్కు ఫ్యాక్ట‌రీ కోసం కోన‌సాగుతున్న ఉద్య‌మం ఇటీవ‌లే 300 రోజుల‌ను పూర్తి చేసుకుంది. ఈ నేప‌థ్యంలోనే Visakha Steel Plant ప్ర‌యివేటీక‌ర‌ణ‌కు వ్య‌తిరేకంగా జ‌రుగుతున్న ఈ ఉద్య‌మాన్ని ఉధృతం చేయాల‌ని కార్మికులు సిద్ధ‌మ‌య్యారు. బీజేపీ మిన‌హా రాష్ట్రంలోని రాజ‌కీయ పార్టీల‌న్ని దీనికి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ళ్యాన్ ఆదివారం నాడు దీక్ష‌కు కూడా దిగ‌బోతున్నారు. గుంటూరు జిల్లా మంగ‌ళ‌గిరిలోని  జనసేన ప్రధాన కార్యాలయంలో ఉదయం 10 నుంచి సాయంత్రం 5గంటల వరకు పవన్ దీక్ష కొనసాగనుంది. ఇప్ప‌టికే దీనికి సంబంధించిన ఏర్పాట్లు సైతం పూర్త‌య్యాయి. ఇలాంటి స‌మ‌యంలో Visakha Steel Plant ప్ర‌యివేటీక‌ర‌ణ విష‌యంలో కేంద్రాన్ని జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఎలాంటి లేఖ‌లు రాయ‌లేద‌ని వెల్ల‌డైంది. ప్ర‌స్తుతం విష‌యం ఇప్ప‌టికే సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారుతోంది. దీనిపై Visakha Steel Plant కార్మికులు, రాజ‌కీయ నేత‌లు ఎలా స్పందిస్తారో చూడాలి. 

Also Read: Lebanon Explosion: లెబనాన్‎లో భారీ పేలుడు..27 మంది మృతి

click me!