ఇక గుంటూరులోనే రెమ్‌డిసివర్ తయారీ... వైసీపీ ఎంపీ లేఖకు కేంద్రం అనుమతి

Siva Kodati |  
Published : May 20, 2021, 02:24 PM IST
ఇక గుంటూరులోనే రెమ్‌డిసివర్ తయారీ... వైసీపీ ఎంపీ లేఖకు కేంద్రం అనుమతి

సారాంశం

గుంటూరు జిల్లా రెమ్‌డిసివర్ తయారీకి కేంద్రంగా మారబోతోంది. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేంద్రంగా పనిచేస్తున్న సేఫ్ ఫార్మాలో రెమ్‌డిసివర్ ఇంజెక్షన్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తం 5 లక్షల డోసుల తయారీకి కేంద్రం గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.

గుంటూరు జిల్లా రెమ్‌డిసివర్ తయారీకి కేంద్రంగా మారబోతోంది. ముప్పాళ్ల మండలం గోళ్లపాడు కేంద్రంగా పనిచేస్తున్న సేఫ్ ఫార్మాలో రెమ్‌డిసివర్ ఇంజెక్షన్ల తయారీకి కేంద్రం అనుమతి ఇచ్చింది. మొత్తం 5 లక్షల డోసుల తయారీకి కేంద్రం గ్రీన్  సిగ్నల్ ఇచ్చింది.

అనుమతి ఇవ్వాలంటూ నరసరావుపేట వైసీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయులు కేంద్రానికి లేఖ రాశారు. దీనిని పరిశీలించిన కేంద్రం  ఈ మేరకు అనుమతి ఇచ్చింది. కాగా, కరోనా చికిత్సలో రెమ్‌డిసివర్ మంచి ఫలితాలను ఇస్తున్న సంగతి తెలిసిందే.

భారత్‌లో ప్రస్తుతం కోవిడ్ బాధితులు పెరిగిపోవడంతో ఈ ఔషధానికి ఎక్కడా లేని డిమాండ్ వచ్చింది. బ్లాక్ మార్కెట్‌లో దీని ధర లక్షల్లో పలుకుతోంది. దీనిని అదునుగా చేసుకుని కొందరు డీలర్లు కృత్రిమ కొరత సృష్టించి భారీగా సొమ్ము చేసుకుంటున్నారు. 

PREV
click me!

Recommended Stories

Holiday : ఈ ఒక్కరోజే స్కూళ్లు, ఆఫీసులు.. మీకు ఈ మెసేజ్ వచ్చిందో మళ్లీ సెలవే..!
Weather Update: మండే భగభగలు.. రికార్డుస్థాయిలో ఉష్ణోగ్రతలు | High Temperatures | Asianet News Telugu