రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం

Published : Mar 29, 2018, 07:09 AM IST
రోజాకు తృటిలో తప్పిన ప్రమాదం

సారాంశం

విమానం ల్యాండ్ అయి రన్ వే మీదున్నపుడు ఒక టైర్ పేలిపోవటంతో పెద్దగా శబ్దం వచ్చి విమానం ఒక్కసారిగి పెద్ద కుదుపుకు గురైంది.

వైఎస్సార్సిపి ఎంఎల్ఏ రోజాకు తృటిలో ప్రమాదం తప్పింది. విషయం ఏమిటంటే, బుధవారం రాత్రి తిరుపతి నుండి హైదరాబాద్ కు చేరుకున్న ఇండిగో విమానం టైర్ పేలిపోవటంతో ప్రయాణీకుల్లో ఒక్కసారిగా ఆందోళన పెరిగిపోయింది.

విమానం ల్యాండ్ అయి రన్ వే మీదున్నపుడు ఒక టైర్ పేలిపోవటంతో పెద్దగా శబ్దం వచ్చి విమానం ఒక్కసారిగి పెద్ద కుదుపుకు గురైంది. దాంతో ఏం జరిగిందో అర్ధంకాక ప్రయాణీకులు భయపడిపోయారు. దాంతో కొద్దిసేపు విమానమంతా అరుపులు, కేకలతో మారుమోగిపోయింది.

అయితే, జరిగిన విషయాన్ని గమనించిన విమానాశ్రయ సిబ్బంది వెంటనే పైలెట్ ను అప్రమత్తం చేశారు. అదే సమయంలో టైర్ పేలిన విషయాన్ని విమాన సిబ్బంది కూడా గమనించారు. జరిగిన విషయాన్ని వివరించి ఆందోళన అవసరం లేదని ప్రయాణీకులకు సర్దిచెప్పటంతో అందరిలోనూ భయం తగ్గింది. ప్రయాణీకుల్లో వైసిపి ఎంఎల్ఏ రోజా కూడా ఉన్నారు.

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan : డిప్యూటీ సీఎం లగ్జరీ కార్ కలెక్షన్ .. ఎన్ని కార్లున్నాయి..? వీటి విలువ ఎంత?
IMD Rain Alert : అల్పపీడనానికి జతకట్టిన ద్రోణి.. ఆకాశాన్ని కమ్మేయనున్న మేఘాలు, తెలుగు రాష్ట్రాల్లో ఇదీ పరిస్థితి..!