రూ.228 కోట్ల రుణం ఎగవేత.. ఏపీలో సీబీఐ సోదాలు, ప్రకాశం సంస్థపై కేసు

Siva Kodati |  
Published : Jan 06, 2022, 03:52 PM ISTUpdated : Jan 06, 2022, 03:55 PM IST
రూ.228 కోట్ల రుణం ఎగవేత.. ఏపీలో సీబీఐ సోదాలు, ప్రకాశం సంస్థపై కేసు

సారాంశం

ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన తేర్‌షేర్ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ (cbi raids) కేసు నమోదు చేసింది. రూ.228 కోట్లు మోసం చేశారని సీబీఐ కేసు పెట్టింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈ సంస్థ రూ.228 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లుగా తెలుస్తోంది.

ప్రకాశం జిల్లాకు (prakasam district) చెందిన తేర్‌షేర్ ప్రైవేట్ కంపెనీపై సీబీఐ (cbi raids) కేసు నమోదు చేసింది. రూ.228 కోట్లు మోసం చేశారని సీబీఐ కేసు పెట్టింది. విశాఖలోని బ్యాంక్ ఆఫ్ బరోడా నుంచి ఈ సంస్థ రూ.228 కోట్ల రుణం తీసుకుని ఎగవేసినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలో గురువారం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో సీబీఐ సోదాలు నిర్వహించింది. ఛైర్మన్ బెల్లం కోటయ్య, జయంత్ బాబులతో పాటు బీకే ఎక్స్‌పోర్ట్, మహి అగ్రో కంపెనీ, విజయ ఏరో బ్లాక్స్ లోనూ సోదాలు చేసింది. మొత్తం పది చోట్ల సీబీఐ అధికారులు తనిఖీలు నిర్వహించారు. నర్రా ప్రసన్న కుమార్‌తో పాటు డైరెక్టర్ల ఇళ్లలోనూ సోదాలు జరిపింది సీబీఐ. 

PREV
click me!

Recommended Stories

Weather Update: ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ.. మరోవైపు 42 డిగ్రీల ఎండలు !
ప్రధాన మంత్రి మోదీకి సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు | CM Chandrababu Naidu at NDA 12 Years Event