రుణాల ఎగవేత: గుంటూరు మాజీ ఎమ్మెల్యే‌పై సీబీఐ కేసు నమోదు

Siva Kodati |  
Published : Apr 21, 2021, 08:54 PM IST
రుణాల ఎగవేత: గుంటూరు మాజీ ఎమ్మెల్యే‌పై సీబీఐ కేసు నమోదు

సారాంశం

గుంటూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సిబిఐ కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్‌ వద్ద రుణం తీసుకోని కట్టకుండా ఎగ్గొట్టాడనే ఆరోపణలతోనే కేసు నమోదు చేసింది.

గుంటూరు నగరానికి చెందిన మాజీ ఎమ్మెల్యే తాడిశెట్టి వెంకట్రావుపై సిబిఐ కేసు నమోదు చేసింది. స్టేట్ బ్యాంక్‌ వద్ద రుణం తీసుకోని కట్టకుండా ఎగ్గొట్టాడనే ఆరోపణలతోనే కేసు నమోదు చేసింది. పొగాకు వ్యాపారం కోసం తాడిశెట్టి వెంకట్రావు ఎస్‌బిఐ నుండి 72 కోట్ల రూపాయల రుణం తీసుకొని తిరిగి చెల్లించలేదు.

తీసుకున్న రుణాలను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లుగా సిబిఐ గుర్తించింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా కాంగ్రెస్‌ పార్టీ తరపున తాడిశెట్టి వెంకట్రావు ఎమ్మెల్యేగా గెలిచారు. ఆయనపై సీబీఐ కేసుకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.

PREV
click me!

Recommended Stories

Rain Alert: తెలుగు రాష్ట్రాల‌పై ద్రోణి ప్ర‌భావం.. ఈ ప్రాంతాల్లో పిడుగుల‌తో కూడిన భారీ వ‌ర్షం, జాగ్ర‌త్త
Pemmasani Chandrasekhar:పోస్టల్ డెలివరీలను 24గంటల్లో పూర్తిచేయడమే దీని లక్ష్యం | Asianet News Telugu