చంద్రబాబుపై చెత్తవాగుడు వాగితే చంపడానికైనా చావడానికైనా సిద్దం: బుద్దా వెంకన్న సంచలనం

Published : Apr 20, 2022, 12:55 PM ISTUpdated : Apr 20, 2022, 01:22 PM IST
చంద్రబాబుపై చెత్తవాగుడు వాగితే చంపడానికైనా చావడానికైనా సిద్దం: బుద్దా వెంకన్న సంచలనం

సారాంశం

చంద్రబాబుపై చెత్తవాగుడును మానుకోవాలని వైసీపీ నేతలకు టీడీపీ నేత బుద్దా వెంకన్న సూచించారు. వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోకపోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.  

విజయవాడ: టీడీపీ చీఫ్ చంద్రబాబుపై చెత్త వాగుడు వాగితే చంపడానికైనా చావడానికైనా తాము సిద్దమేనని టీడీపీ నేత బుద్దా వెంకన్న  వైసీపీకి వార్నింగ్ ఇచ్చారు.బుధవారం నాడు  Buddha Venkanna మీడియాతో మాట్లాడారు. Chandrababu Naiduపై చెత్తవాగుడు మానుకోవాలని సూచించారు. 100 మందితో Suicide  బ్యాచ్  తయారు చేశామన్నారు. చంపడానికైనా చావడానికైనా సిద్దమేనన్నారు. చంద్రబాబు కుటుంబంపై పిచ్చి వేషాలు మానుకోవాలని ఆయన YCP నేతలకు సూచించారు. అంతేకాదు వైసీపీ నేతలు నోరు అదుపులో పెట్టుకోవాలని కూడా కోరారు.చంద్రబాబు కుటుంబం జోలికి వస్తే ఎంతకైనా తెగిస్తామన్నారు.

చంద్రబాబును తిడితే TDP ఆఫీస్ పై దాడి చేస్తే పదవులు వస్తాయనే భ్రమల నుండి వైసీపీ నేతలు బయటకు రావాలన్నారు. సీనియర్లను కాదని జోగి  రమేష్ కి మంత్రి పదవి ఎలా వచ్చిందని ఆయన ప్రశ్నించారు. వైసీపీ నేతలు ఎవరైనా నోరు అదుపులో పెట్టుకోవాల్సిందేనన్నారు. 
 

PREV
click me!

Recommended Stories

School Holidays : తెలుగు స్టూడెంట్స్ కి మొహర్రం సెలవు ఉన్నట్లా, లేనట్లా? క్లారిటీ వచ్చేదెలా?
Gade Sai Krishna Case: సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం సీఐ నాగరాజు అరెస్ట్ | Asianet News Telugu