జగన్ నిర్వహకం వల్ల రోడ్డున పడ్డ కాంట్రాక్టర్లు.. విరుచుకుపడ్డ విష్ణు కుమార్ రాజ్

Published : Oct 09, 2021, 02:33 PM IST
జగన్ నిర్వహకం వల్ల రోడ్డున పడ్డ కాంట్రాక్టర్లు.. విరుచుకుపడ్డ విష్ణు కుమార్ రాజ్

సారాంశం

సీఎం జగన్ నిర్వహకం వల్ల కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మండిపడ్డారు.తినడానికి తిండి కూడా లేకుండా వారు ఉన్నారు అంటే దౌర్భాగ్య పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, వారికి ఎప్పుడు ఇలాంటి దీన స్థితి కాంట్రాక్టర్లు కి రాలేదని అన్నారు.

సీఎం జగన్ నిర్వహకం వల్ల కాంట్రాక్టర్లు రోడ్డున పడ్డారంటూ బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజ్ మండిపడ్డారు.తినడానికి తిండి కూడా లేకుండా వారు ఉన్నారు అంటే దౌర్భాగ్య పరిస్థితి అర్థం చేసుకోవచ్చని, వారికి ఎప్పుడు ఇలాంటి దీన స్థితి కాంట్రాక్టర్లు కి రాలేదని అన్నారు.

అంతకు ముందు జన్మలో కూడా పాపాలు చేసి ఉంటే సీఎం జగన్ ప్రభుత్వం లో పని చేయడమే అన్నారు. ఇలాంటి దారుణ పరిస్థితి లో కూడా పట్టించుకోకుండా సంక్షేమ పథకాలు కోసం బుట్టన్ నొక్కేస్తున్నారు.

కాంట్రాక్టర్లు ఆత్మహత్య లు చేసుకున్న వైనం చూస్తున్నాం అన్నారు. జగన్ ప్రభుత్వంలో టెంపరరీ ప్రభుత్వ కాంట్రాక్టర్లు భయపడాల్సిన అవసరం లేదన్నారు. మా ప్రభుత్వం అధికారం లోకి వచ్చాక వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.

ఈ దుర్మార్గుడు పెట్టిన బాధలతో సొమ్ము ఒక్కర్ధి సోకు ఒక్కర్ధి అని ఎద్దేవా చేశారు. ఎంతో మంది నాకు కాల్స్ చేసి బాధలు చెపుతున్నారన్నారు. నీ వల్ల చనిపోయిన కాంట్రాక్టర్లు కు ఆర్ధిక సహాయం చేయాలి అని జగన్ ను డిమాండ్ చేశారు. 

ఖాకీ చొక్కా తీసేసి వైసీపీ చొక్కా తొడుక్కున్నారు.. పోలీసులపై నారా లోకేశ్ ఆరోపణలు

ప్రజలు కూడా మీ పిచ్చి చేష్టలు చూస్తున్నారు.  తాకట్టుకి మీకు విశాఖ దొరికిందా? కడపలో ఉన్న ఆస్తులపై తాకట్టు పెట్టండి. విశాఖ లో తర్వాత ఎన్నికలో డిపాజిట్ లు కూడా రావు. ప్రధానికి మోడీ గారికి జగన్ ఓ లేఖ రాశారన్నారు.  

మీకు మంత్రిత్వ శాఖ ఉందా...? నువ్వో అట్టర్ ప్లాప్ సీఎం...అంటూ మండిపడ్డారు. జగన్ అన్న ఇళ్ళు జగన్ అన్న కాలనీలపై మీకు ప్లానింగ్ ఉందా? అంటూ మండిపడ్డారు. మీకు 100 ఎక్కరాలు కావాలి..ప్రజలకు మాత్రం సేంట్ భూమి వద్దా అంటూ విరుచుకుపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

Heat Wave Alert : నేడు పీక్స్ ఎండలు... ఈ ప్రాంతాల్లో ఏకంగా 41 డిగ్రీల హై టెంపరేచర్స్, బిఅలర్ట్
Palla Srinivas Rao Speech: అక్కడ దౌర్జన్యం చేస్తూ డబ్బులు వసూళ్లు | Asianet News Telugu