నిమ్మగడ్డ ప్రసాద్ కి బెయిల్ మంజూరు

Published : Aug 03, 2019, 08:02 AM ISTUpdated : Aug 03, 2019, 08:11 AM IST
నిమ్మగడ్డ ప్రసాద్ కి బెయిల్ మంజూరు

సారాంశం

వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నిందితుడిగా ఉన్న నిమ్మగడ్డ ప్రసాద్ ణు ఐరోపా దేశమైన సెర్బియా పోలీసులు ఇటీవల అరెస్టు చేశారు. ఆయన విహారయాత్రకు అని అక్కడికి వెళ్లగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

నిమ్మగడ్డ ప్రసాద్‌కు బెల్‌గ్రేడ్‌ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రస్‌అల్‌ ఖైమా ఫిర్యాదుతో నాలుగు రోజుల క్రితం నిమ్మగడ్డను బెల్‌గ్రేడ్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిమ్మగడ్డ స్వదేశానికి వచ్చే విషయంపై బెయిల్ ఉత్తర్వుల పరిశీలన తర్వాత స్పష్టత వస్తుందని లాయర్లు తెలిపారు. 

వాన్‌పిక్‌ వ్యవహారంలో లాభాలు ఆర్జించడానికి, నిధులు తరలించడానికి ఉద్దేశపూర్వకంగా నష్టం కలిగించారనే ఆరోపణలపై యూఏఈ ఫెడరల్‌ క్రిమినల్‌ కోడ్‌లోని ఆర్టికల్‌ 5/5, 44, 225, 227, 228, 230, 399 కింద నిమ్మగడ్డ ప్రసాద్‌పై కేసు నమోదైంది. ఆ కేసులో నిందితుడిని తమకు అప్పగించాలన్న రస్‌ ఆల్‌ ఖైమా(రాక్‌) దేశ అభ్యర్థన మేరకు అబుదాబిలోని ఇంటర్‌ పోల్‌ 2016 సెప్టెంబరు 5న రెడ్‌ కార్నర్‌ నోటీసు జారీ చేసింది.

అది జారీ అయ్యాక బ్రిటన్‌, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో నిమ్మగడ్డ పర్యటించినా పట్టించుకోలేదు. సెర్బియా వెళ్లినపుడు అకస్మాత్తుగా అక్కడి పోలీసులు జులై 27న ఆయన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బెల్‌గ్రేడ్‌లోని ఉన్నత న్యాయస్థానంలో హాజరుపరిచారు. సదరు నిర్బంధాన్ని కోర్టు అనుమతించింది.

‘‘ఈ నిర్బంధం జులై 27న ఉదయం 8.20 గంటల నుంచి అమల్లోకి వస్తుంది. ప్రతి రెండు నెలలకోసారి పరిస్థితులను సమీక్షించి నిర్బంధ ఉత్తర్వులను పొడిగించే అవకాశం ఉంటుంది. గరిష్ఠంగా ఏడాది వరకు నిర్బంధాన్ని కొనసాగించడానికి వీలుంటుంది’’ అని కోర్టు పేర్కొంది.

‘‘ఇంటర్‌పోల్‌ జారీ చేసిన రెడ్‌కార్నర్‌ నోటీసు, తమకు అప్పగించాలన్న రాక్‌ అభ్యర్థన మా వద్ద ఉంది. సెర్బియాలో నిందితునికి నివాసం లేదు. రాగేటరీ లేఖల ఆధారంగా అప్పగింత కార్యక్రమాలు పూర్తయ్యేలోగా పారిపోవడానికి, తప్పించుకుని తిరగడానికి అవకాశం ఉన్నందున నిర్బంధంలోకి తీసుకోవచ్చు’’ అని కోర్టు అభిప్రాయపడింది.

నిందితుడి వాదనలు వినకుండా తక్షణం అదుపులోకి తీసుకోవడానికి చట్టాలు అనుమతిస్తున్నాయని ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా షరతులతో నిమ్మగడ్డను కోర్టు విడుదల చేసినట్టు సమాచారం. విడుదలైనప్పటికీ అక్కడున్న చట్ట ప్రక్రియ పూర్తయ్యేదాకా ఆయన బెల్‌గ్రేడ్‌ నగరం నుంచి బయటికి వెళ్లడానికి అవకాశం ఉండదు.

related news

సెర్బియా పోలీసుల అదుపులో నిమ్మగడ్డ... సీబీఐ కోర్టులో మెమో దాఖలు

పోలీసుల అదుపులో నిమ్మగడ్డ ప్రసాద్... కేంద్రం సహాయం కోరిన వైసీపీ

PREV
click me!

Recommended Stories

Andhra Pradesh Legislative Council: తిరుమల నెయ్యి కల్తీ పైఅసెంబ్లీ లో రచ్చ రచ్చ | Asianet Telugu
CM Chandrababu Speech: ఏపీ ప్రాజెక్టులపై అసెంబ్లీలో చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్| Asianet News Telugu