ఢిల్లీలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి పర్యటన: అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ

Published : Aug 02, 2019, 09:05 PM IST
ఢిల్లీలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి పర్యటన: అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ లతో భేటీ

సారాంశం

మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ కి  శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.   

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యధిక నిధులిచ్చి రాష్ట్ర అభివృద్ధికి తోడ్పాటును ఇవ్వాలని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ను కోరారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. టీటీడీ చైర్మన్ హోదాలో వైవీ సుబ్బారెడ్డి తొలిసారిగా ఢిల్లీలో పర్యటించారు. ఈ సందర్భంగా అమిత్ షాకు శ్రీవారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.

మరోవైపు కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ను సైతం కలిశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి. విభజన హామీలను పూర్తిగా నెరవేర్చాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇతోధికంగా నిధులిచ్చి అభివృద్ధికి తోడ్పాటునివ్వాలని విజ్ఞప్తి చేశారు. అనంతరం రాజ్ నాథ్ సింగ్ కి  శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. 
 

PREV
click me!

Recommended Stories

తిరుమ‌ల కాలిన‌డక మార్గంలో రోబో డాగ్.. ఇంత‌కీ దీని ఉప‌యోగం ఏంటంటే.?
Crop insurance: రైతులకు గుడ్ న్యూస్.. పంటల బీమా గడువు పెంపు.. దీని ప్రయోజనాలు ఏంటో తెలుసా?