అరకు అసెంబ్లీలో ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకున్నాయి. ముఖ్యంగా వైసిపిలో అరకు అభ్యర్థి ఎంపిక కోసం సుధీర్ఘ కసరత్తు జరిగింది. అరకులో కొండదొర సామాజికవర్గ ఓటర్లు దగ్గరదగ్గర లక్షమంది వున్నారు. దీంతో ఆ సామాజికవర్గానికి అరకు సీటు కేటాయించాలని వైసిపి భావించింది. ఈ క్రమంలో సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న చిట్టి పాల్గుణకు కాకుండా ఎంపీ గొడ్డేడి మాధవికి ఇంచార్జీ బాధ్యతలు అప్పగించింది వైసిపి. అయితే అరకు వైసిపి నాయకులు మాధవిని తీవ్రంగా వ్యతిరేకించడంతో ఇంచార్జీ బాధ్యతల నుండి తప్పించారు. ఆ స్థానంలో స్థానిక నాయకుడు మత్స్యలింగం ను నియమించింది.
ఇక మావోయిస్టుల చేతిలో దారుణ హత్యకు గురయిన మాజీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు తనయుడు కిడారి శ్రావణ్ కుమార్ ను గతంలో టిడిపి మంత్రిపదవి ఇచ్చింది. ఆ తర్వాత 2019 అసెంబ్లీ ఎన్నికల్లోనూ శ్రావణ్ ను బరిలోకి దింపింది. కానీ అతడు ఆ ఎన్నికల్లో ఓటమిపాలయ్యాడు. దీంతో ఈసారి శ్రావణ్ ను పక్కనబెట్టిన టిడిపి సియారి దొన్నుదొర ను బరిలో దింపింది.
అరకు నియోజకవర్గ పరిధిలోని మండలాలు :
1. ముంచింగిపుట్టు
2. పెడబయలు
3. డుంబ్రిగూడ
4. హుకుంపేట
5. అనంతగిరి
6. అరకు లోయ
అరకు అసెంబ్లీ ఓటర్లు :
నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య (2019 ఎన్నికల ప్రకారం) - 2,20,893
పురుషులు - 1,08,190
మహిళలు - 1,12,698
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2024 అభ్యర్థులు :
అరకు అసెంబ్లీకి వైసీపీ అభ్యర్థిగా రేగం మత్య్స లింగం పోటీలో ఉన్నారు. ఇక టీడీపీ నుంచి సియ్యారి దొన్ను దొరను అరకు ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దించింది. ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీ ఉంది. వీరిలో ఎవరు విన్నర్ అనేది కాసేపట్లో తేలనుంది. ప్రస్తుతానికి వైసీపీ లీడింగ్ కనిపిస్తుంది.
అరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు :
అరకు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు 2024
అరకు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలుపొందింది. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఎన్నికల్లో వైసీపీ అరకు ఎమ్మెల్యే అభ్యర్థి రేగం మత్స్యలింగం విజయం సాధించారు. తన ప్రత్యర్థి, బీజేపీ అభ్యర్థి పాంగి రాజారావుపై 31,877 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2019 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,57,575 (71 శాతం)
వైసిపి - చెట్టి పాల్గుణ - 53,101 (33 శాతం) - 25,441 ఓట్ల మెజారిటీతో విజయం
స్వతంత్ర అభ్యర్థి - దొన్నుదొర సియ్యారి - 27,660 (17 శాతం) - ఓటమి
టిడిపి - కిడారి శ్రావణ్ కుమార్ - 19,929 (12 శాతం)
అరకు అసెంబ్లీ ఎన్నికలు 2014 ఫలితాలు :
నియోజకవర్గంలో పోలయిన మొత్తం ఓట్లు - 1,50,109 (70 శాతం)
వైసిపి - కిడారి సర్వేశ్వరరావు - 63,700 (43 శాతం) - 34,053 ఓట్ల మెజారిటీతో విజయం
టిడిపి - సివేరి సోమ - 29,647 (20 శాతం) - ఓటమి