చిత్తూరులో కరోనా జోరు: ఏపీలో మొత్తం కేసులు 20,58,582కి చేరిక

By narsimha lodeFirst Published Oct 13, 2021, 5:04 PM IST
Highlights


ఏపీలో కరోనా కేసులు తగ్గు ముఖం పట్టాయి. అయితే కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల వ్యాప్తి కొనసాగుతుంది. రాష్ట్రంలో కరోనా కేసులు 20,58,582కి చేరుకొన్నాయి.దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,276 కి చేరింది. 


అమరావతి:ఆంధ్రప్రదేశ్ (andhra pradesh) రాష్ట్రంలో కరోనా (corona cases) కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో38,786 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 517 మందికి కరోనా నిర్ధారణ అయింది.  రాష్ట్రంలో కరోనా కేసులు 20,58,582కి చేరుకొన్నాయి.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి  ఎనిమిది మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 14,276 కి చేరింది. 

also read:ఇండియాలో గత 24 గంటల్లో 15,823 కరోనా కేసులు: కేరళలోనే సగం కేసులు

గడిచిన 24 గంటల్లో 826 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 20లక్షల 37వేల 691 మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 6615 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,88,39,595 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. 

గత 24 గంటల్లో అనంతపురంలో003,చిత్తూరులో 097, తూర్పుగోదావరిలో088,గుంటూరులో084,కడపలో 026, కృష్ణాలో071, కర్నూల్ లో005, నెల్లూరులో038, ప్రకాశంలో 038,విశాఖపట్టణంలో 031,శ్రీకాకుళంలో006, విజయనగరంలో 002,పశ్చిమగోదావరిలో 028 కేసులు నమోదయ్యాయి.


గత 24 గంటల్లో కరోనాతో ఎనిమిది మంది మృతి చెందారు. కృష్ణా, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున కరోనాతో చనిపోయారు. చిత్తూరు, తూర్పు గోదావరి జిల్లాల్లో ఒక్కొక్కరి చొప్పున చనిపోయారు. దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 14,276కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,57,709, మరణాలు 1093
చిత్తూరు-2,45,381, మరణాలు1931
తూర్పుగోదావరి-2,92,664, మరణాలు 1287
గుంటూరు -1,77,059,మరణాలు 1226
కడప -1,15,282, మరణాలు 641
కృష్ణా -1,18,315,మరణాలు 1403
కర్నూల్ - 1,24,073,మరణాలు 852
నెల్లూరు -1,45,859,మరణాలు 1047
ప్రకాశం -1,38,079, మరణాలు 1109
శ్రీకాకుళం-1,22,840, మరణాలు 785
విశాఖపట్టణం -1,57,143, మరణాలు 1123
విజయనగరం -82,848, మరణాలు 670
పశ్చిమగోదావరి-1,78,435, మరణాలు 1109

 

: 13/10/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 20,55,687 పాజిటివ్ కేసు లకు గాను
*20,34,796 మంది డిశ్చార్జ్ కాగా
*14,276 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 6,615 pic.twitter.com/3MNDSfvZMV

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!