వైసీపీవీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు: మంత్రి నక్కా ఆనందబాబు

Published : Feb 20, 2019, 04:51 PM IST
వైసీపీవీ బ్లాక్ మెయిల్ రాజకీయాలు: మంత్రి నక్కా ఆనందబాబు

సారాంశం

ఆఖరికి పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులను బెదిరించేందుకే వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రైతును చంపే అవసరం తమ ప్రభుత్వానికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. 

అమరావతి: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై మంత్రి నక్కా ఆనందబాబు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. వైసీపీ బ్లాక్ మెయిల్ రాజకీయాలకు పాల్పడటం అలవాటుగా చేసుకుందని ఆరోపించారు.  రైతు కోటయ్య మృతిపై ఆరోపణలు చేస్తూ వైసీపీ బ్లాక్‌మెయిల్ రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. 

ఆఖరికి పోలీసులను బ్లాక్‌మెయిల్ చేస్తోందని మండిపడ్డారు. పోలీసులను బెదిరించేందుకే వైసీపీ డ్రామాలు ఆడుతోందని ఆరోపించారు. రైతును చంపే అవసరం తమ ప్రభుత్వానికి ఎందుకుంటుందని ప్రశ్నించారు. 

తమపై, ప్రభుత్వంపై కుట్రలు చేయడమే వైసీపీ పనిగా పెట్టుకుందన్నారు. బ్లాక్ మెయిల్ రాజకీయాలు మానుకోకపోతే రాబోయే ఎన్నికల్లో ప్రజలు వైసీపీకి ఓటుతో గట్టి దెబ్బ కొడతారని మంత్రి నక్కా ఆనందబాబు అన్నారు. 

PREV
click me!

Recommended Stories

srikakulam folk : మారుమూల పల్లెలో పుట్టి న్యూయార్క్ టైం స్వేర్ కు చేరిన తెలుగు జానపదం.. ఏదో తెలుసా..?
Godavari Pushkaralu పనులకు శ్రీకారం: రూ.9.55 కోట్లతో అభివృద్ధి పనులు ప్రారంభం | Asianet News Telugu