ప్రభుత్వాన్ని అలా ఆదేశించాలంటూ అచ్చెన్న పిటిషన్... హైకోర్టు విచారణ

By Arun Kumar PFirst Published Jul 6, 2020, 8:57 PM IST
Highlights

ప్రభుత్వం హాస్పిటల్ లో కాకుండా తనకు ప్రైవేట్ హాస్పిటల్ లో మైరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాంటూ టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. 

అమరావతి: ప్రభుత్వం హాస్పిటల్ లో కాకుండా తనకు ప్రైవేట్ హాస్పిటల్ లో మైరుగైన చికిత్స అందించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాంటూ టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి అచ్చెన్నాయుడు ఏపి హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై ఇవాళ హైకోర్టు విచారణ జరిపింది. అయితే తీర్పును మాత్రం జులై 8వ తేదీ(బుధవారం)కి వాయిదా వేసింది ధర్మాసనం.  

ఈఎస్ఐ స్కాంలో ఈ ఏడాది మే 7వ తేదీన ఏసీబీ అధికారులు అచ్చెన్నాయుడును అరెస్ట్ చేశారు. నిమ్మాడలో అరెస్ట్ చేసి ఆయనను విజయవాడకు తరలించారు. జీజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స నిర్వహించిన తర్వాత ఈ నెల 1వ తేదీన ఆయనను గుంటూరు జైలుకు తరలించారు. 

ఇలా జైలులో ఉన్న అచ్చెన్నాయుడును ప్రైవేట్ ఆసుపత్రికి తరలించేందుకు అవకాశం ఇవ్వాలని హైకోర్టులో అచ్చెన్నాయుడు న్యాయవాదులు పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై ఇరువర్గాల వాదనలను విన్న హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

read more  ఏసీబీ కోర్టులో చుక్కెదురు: హైకోర్టుకు వెళ్లే యోచనలో అచ్చెన్నాయుడు

ఇక  అచ్చెన్నాయుడు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించగా... ఈ నెల 3వ తేదీన ఏసీబీ కోర్టు ఈ బెయిల్ పిటిషన్ ను కొట్టేసింది. అచ్చెన్నాయుడుకు బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని  ఏసీబీ తరపు న్యాయవాది కోర్టులో వాదించారు. దీంతో అచ్చెన్నాయుడు బెయిల్ పిటిషన్ ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది. 

ఈ  తీర్పును సవాల్ చేస్తూ అచ్చన్నాయుడు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఏసీబీ కస్టడీ పూర్తి కావడంతో వెంటనే బెయిల్ ఇవ్వాలని ఆ పిటిషన్ లో అచ్చెన్నాయుడు తరపు న్యాయవాదులు హైకోర్టును కోరారు. అచ్చెన్నాయుడు ప్రస్తుతం గుంటూరు జైలులో ఉన్నారు. 

click me!