
విశాఖపట్నం జిల్లాలో మైనింగ్ అక్రమాలపై ఏపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది. సహజ వనరుల దోపిడిపై ఇప్పటికే సర్కార్కు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో విశాఖలోని క్వారీలపై తనిఖీల కోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టనుంది. డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత సర్వే ద్వారా అక్రమాలను గుర్తించాలని నిర్ణయించింది. ఇష్టారాజ్యంగా జరుగుతున్న గనుల తవ్వకాలకు చెక్ పెట్టనుంది. అనకాపల్లిలోని ఓ మైనింగ్ కంపెనీ కార్యకలాపాలపై సీఐడీ విచారణకు ఆదేశించినట్లుగా తెలుస్తోంది.