అలాంటి కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

Published : Dec 04, 2022, 07:10 AM IST
అలాంటి కంపెనీలకు ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది: ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌

సారాంశం

Vijayawada: అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నుంచి కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయని గుర్తించి నోటీసులు జారీ చేశామని మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. అయితే, హైకోర్టును ఆశ్రయించగా, కాలుష్య నియంత్రణకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.

IT and Industries Minister Gudivada Amarnath: అధిక కాలుష్యం వెదజల్లుతున్న కంపెనీలపై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం కఠినంగా వ్యవహరిస్తుందనీ, ప్రజలకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా నిర్వహిస్తున్న కంపెనీలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ స్పష్టం చేశారు. శనివారం నాడు విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ.. అమరరాజా బ్యాటరీస్ లిమిటెడ్ నుంచి కాలుష్య ఉద్గారాలు వెలువడుతున్నాయని గుర్తించి నోటీసులు జారీ చేశామన్నారు. అయితే వారు హైకోర్టును ఆశ్రయించగా, కాలుష్య నియంత్రణకు చట్టపరమైన చర్యలు తీసుకోవచ్చని ప్రభుత్వానికి సూచించింది.

హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ అమరరాజా యాజమాన్యం సుప్రీంకోర్టును ఆశ్రయించిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హెరిటేజ్ ఫుడ్స్ పరిశ్రమ ఆంధ్రప్రదేశ్ అంతటా విస్తరించి ఉందని అమర్‌నాథ్ ప్రస్తావించారు. "వారి వ్యాపారాన్ని ప్రభావితం చేయడంలో వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ఎక్కడైనా ప్రమేయం ఉందా? రాష్ట్ర ప్రభుత్వం పరిశ్రమలను రాజకీయ కోణంలో చూస్తే నాయుడు ఏపీలో కంపెనీని నడపగలరా?" అని ప్రశ్నించాడు. రాష్ట్రానికి మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి వేలాది మందికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృతనిశ్చయంతో ఉన్నారని ఐటీ శాఖ మంత్రి తెలిపారు.

రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి గణనీయంగా ఉందని, దేశ జీడీపీ కంటే ఏపీ జీడీపీ రెండు శాతం ఎక్కువగా ఉందని అమర్ నాథ్ వివరించారు. గడిచిన ఆరు నెలల్లో రాష్ట్రంలో అనేక పరిశ్రమలు ప్రారంభమయ్యాయని, అనేక పరిశ్రమలకు శంకుస్థాపన చేశామని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలోని పొడవైన తీరప్రాంతాన్ని పారిశ్రామికంగా బలోపేతం చేసేందుకు ప్రభుత్వం వ్యూహరచన చేస్తుందన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న ఆక్వా ఎగుమతుల్లో 45 శాతం ఏపీ నుంచే జరుగుతున్నాయని మంత్రి మీడియాకు తెలిపారు. విశాఖపట్నంలో మూడుసార్లు జరిగిన భాగస్వామ్య సదస్సుల్లో రూ.16 లక్షల కోట్ల పెట్టుబడులు రాగా, అందులో నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రూ.34 వేల కోట్ల పెట్టుబడులు మాత్రమే వచ్చాయని తెలిపారు. 

ఇదిలావుండగా, అనకాపల్లి మండలం తుంపాల గ్రామంలో 28 లక్షల రూపాయలతో నాడు-నేడు కింద ఆధునికరించిన తుమ్మపాల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి  ప్రారంభించారు.

 

 

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం ప్రతీకార రాజకీయాల కారణంగా అమరరాజా గ్రూప్‌ ఆంధ్రప్రదేశ్‌ నుంచి తరలివెళ్లి రాష్ట్రంలో పెట్టుబడులు ఆపేయాలని యోచిస్తోందన్న టీడీపీ జాతీయ అధ్యక్షుడు ఎన్‌.చంద్రబాబు నాయుడు ఆరోపణను పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ తోసిపుచ్చారు. “రాష్ట్ర ప్రతిష్టను దిగజార్చే లక్ష్యంతో రెండు తెలుగు దినపత్రికలు చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు పని చేస్తున్నాయి.  నాయుడుకు రాజకీయ లబ్ధి చేకూర్చడమే కాకుండా ఆయనను ముఖ్యమంత్రిని చేయడమే వారి ప్రయత్నాలు'' అని అమర్‌నాథ్ అన్నారు.

“ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడం లేదని, తమ స్థావరాన్ని ఇతర రాష్ట్రాలకు మార్చుతున్నామని కంపెనీ ప్రతినిధి ఎవరైనా ప్రకటించారా? ఒక పరిశ్రమ లేదా కంపెనీ ఒకే రాష్ట్రంలో ఉండాలనీ, ఇతర రాష్ట్రాలకు దాని కార్యకలాపాలను విస్తరించకూడదని ఏదైనా నియమం ఉందా?" అని మంత్రి ప్రశ్నించారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Coldwave Alert : తెలంగాణా లేక కాశ్మీరా..! ఇక్కడ మరీ సింగిల్ డిజిట్ టెంపరేచరేంటి..! బిఅలర్ట్
IMD Rain Alert: మ‌ళ్లీ వ‌ర్షాలు బాబోయ్‌, చ‌లి కూడా దంచికొట్ట‌నుంది.. జాగ్ర‌త్త‌గా ఉండాల్సిందే