బిటెక్ రవికి షాక్: గన్ మెన్ల తొలగింపు

Published : Apr 17, 2023, 07:20 PM ISTUpdated : Apr 17, 2023, 10:31 PM IST
బిటెక్ రవికి  షాక్: గన్ మెన్ల తొలగింపు

సారాంశం

మాజీ ఎమ్మెల్సీ   టీడీపీ నేత బిటెక్ రవి గన్ మెన్లను  ప్రభుత్వం  తొలగించింది. బిటెక్ రవి గన్ మెన్లను  వెనక్కు రావాలని  పోలీస్ శాఖ ఉన్నతాధికారులు  ఆదేశించారు.  

కడప: మాజీ ఎమ్మెల్సీ, టీడీపీ నేత బిటెక్ రవి గన్ మెన్లను  ప్రభుత్వం తొలగించింది. బిటెక్ రవి వద్ద ఉన్న ఇద్దరు గన్ మెన్లను  వెనక్కు రావాలని పోలీస్ శాఖ ఉన్నతాధికారుల నుండి  గన్ మెన్లకు  సమాచారం అందింది.

ఈ ఏడాది  మార్చి29వ తేదీతో  బిటెక్  రవి  ఎమ్మెల్సీ పదవి  కాలం ముగిసింది. తనకు గన్ మెన్లను  తొలగించడంపై  న్యాయపోరాటం  చేస్తానని  బిటెక్ రవి  ప్రకటించారు.  గతంలో  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  టీడీపీ అధికారంలో  ఉన్న సమయంలో  2+2 గన్ మెన్లు ఉండేవారు.  చంద్రబాబు  సర్కార్  గద్దెదిగి జగన్ సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత  1+1 గన్ మెన్లను  కుదించింది  పోలీస్ శాఖ.  పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి బిటెక్ రవి  ఇంచార్జీగా  ఉన్నారు. 

also read:వైఎస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణ రేపటికి వాయిదా: సీబీఐకి హైకోర్టు సూచనలు

2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో  వైఎస్  వివేకానందరెడ్డిపై  బిటెక్ రవి ఎమ్మెల్సీగా విజయం సాధించారు.  ఈ ఎన్నికల్లో బీటెక్ రవి  విజయం సాధించడంపై  వైఎస్ వివేకానందరెడ్డి   పార్టీలోని కొందరిపై  తీవ్ర ఆగ్రహం వ్యక్తం  చేశారని  ప్రచారం కూడా లేకపోలేదు . వైఎస్ భాస్కర్ రెడ్డి, వైఎస్ అవినాష్ రెడ్డిలు  వైఎస్  వివేకానందరెడ్డిని  ఓడించారనే ఆరోపణలు  కూడా  ఉన్నాయి.  వివేకా హత్య  కేసులో  2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమి అంశాన్ని కూడా  సీబీఐ ప్రస్తావిస్తుంది. 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Naidu: ఆధునిక అగ్నిమాప‌ వాహనాలు ప్రారంభించిన సీఎం చంద్రబాబు | Asianet News Telugu
CM Chandrababu Naidu: ఏపీకి 252.93 కోట్లతో కొన్న ఆధునిక అగ్నిమాపక వాహనాలు| Asianet News Telugu