ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి గారు అనకాపల్లి జిల్లాలోని అచ్యుతాపురం, రాయవరం, సబ్బవరం ప్రాంతాల్లో రేషన్ షాపులను తనిఖీ చేశారు. ప్రజలకు అందుతున్న రేషన్ సరుకుల నాణ్యత, పంపిణీ విధానం, స్టాక్ వివరాలను పరిశీలించారు.