AP CMRF SCAM :నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ

Published : Sep 22, 2021, 04:43 PM IST
AP CMRF SCAM :నలుగురిని అరెస్ట్ చేసిన ఏసీబీ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్ఎఫ్ స్కాం లో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏసీబీ ప్రకటించింది. 2014 నుండి సీఎంఆర్ఎఫ్ స్కాం విచారణను చేస్తోంది ఏసీబీ.


అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సీఎంఆర్‌ఎఫ్ స్కాం ( CMRF Scam)లో నలుగురిని అరెస్ట్ చేసినట్టుగా ఆంధ్రప్రదేశ్ ఏసీబీ (ACB) ప్రకటించింది. అరెస్టైన నలుగురిలో ఇద్దరు ప్రభుత్వ ఉద్యోగులు కాగా,  ఇద్దరు ప్రైవేట్ వ్యక్తులున్నారని ఏసీబీ ప్రకటించింది.

also read:ఏపీ సెక్రటేరియట్ లో భారీ స్కామ్.. సీఎం రిలీఫ్ ఫండ్ నిధుల గోల్ మాల్, గుట్టు రట్టు చేసిన ఏసీబీ.. !

2014 నుండి ఏపీ రాష్ట్రంలో సీఆర్‌పీఎఫ్ స్కీమ్ లో అక్రమాలపై జగన్ సర్కార్ విచారణ చేస్తోంది. సీఆర్‌పీఎఫ్ పేరుతో పెద్ద ఎత్తున కుంభకోణం చోటు చేసుకొందని అనుమానించిన ప్రభుత్వం ఏసీబీ విచారణకు ఆదేశించింది. ఈ విషయమై ఏసీబీ అధికారులు ఆరు మాసాలుగా విచారణ చేస్తున్నారు.

పీఎంఆర్ఎఫ్ స్కామ్ లో ప్రజా ప్రతినిధుల పీఏలు,  ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఉన్నట్టుగా ఏసీబీ అధికారులు గుర్తించారు.చలువాడి సుబ్రమణ్యం (A-1) , సోక రమేష్ (A-2), చదలవాడ మురళీకృష్ణ (A-3) కొండెపూడి జగదీష్ ధన్‌రాజ్(A-4)లను  అరెస్ట్ చేసినట్టుగా ఏసీబీ తెలిపింది.సీఎంఆర్ఎఫ్ స్కాంలో  ఎంత మొత్తం నిధులు దుర్వినియోగమయ్యాయనే విషయమై ఏసీబీ ప్రకటించలేదు. మరో వైపు ఈ విషయమై ఇంకా ఎందరి ప్రమేయం ఉందనే విషయమై ఏసీబీ ప్రకటించలేదు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

పిల్ల‌లు కాదు పిశాచాలు.. టీచ‌ర్‌పై దాడి చేసి ప‌దో త‌ర‌గ‌తి విద్యార్థి. వీడియో చూస్తే ఒళ్లు మండాల్సిందే.
Chintha Vijay Prathap Reddy: జగ్గయ్యపేట అంగన్వాడీ కేంద్రాలపై ఫుడ్ కమిషన్ తనిఖీ| Asianet News Telugu