రఘరామకృష్ణంరాజు‌ కేసు: ముగ్గురితో మెడికల్ బోర్డు ఏర్పాటు చేసిన సీఐడీ కోర్టు

By narsimha lodeFirst Published May 16, 2021, 1:47 PM IST
Highlights

 నర్పాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  కేసులో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది సీఐడీ కోర్టు. గుంటూరు  ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ప్రభావతిని మెడికల్ బోర్డు హెడ్‌గా నియమించింది కోర్టు. 

గుంటూరు: నర్పాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజు  కేసులో మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది సీఐడీ కోర్టు. గుంటూరు  ప్రభుత్వాసుపత్రి సూపరింటెండ్ ప్రభావతిని మెడికల్ బోర్డు హెడ్‌గా నియమించింది కోర్టు. ఈ కమిటీలో  మరో ముగ్గురిని సభ్యులుగా నియమించింది న్యాయస్థానం. హెడ్ ఆఫ్ ది జనరల్ మెడిన్ డాక్టర్ నరసింహం, ఆర్థోపెడిక్ డాక్టర్ వరప్రసాద్, జనరల్ సర్జన్ సుబ్బారావులు వీరిలో ఉన్నారు. 

alsop read:మా నాన్నను కొట్టిచిత్రహింసలు పెట్టారు: మోడీ, ఓంబిర్లాకు ఎంపీ రఘురామకృష్ణంరాజు కొడుకు భరత్ లేఖలు

పోలీసులు తనను చిత్రహింసలు పెట్టారని తీవ్రంగా కొట్టారని ఎంపీ రఘురామకృష్ణంరాజు  కోర్టుకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై  ఎంపీ రఘురామకృష్ణంరాజుకు 18 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని కోర్టు ఆదేశించింది. రెండు ఆసుపత్రుల్లో పరీక్షలు నిర్వహించాలని  కోర్టు ఆదేశించింది. ఈ రెండు ఆసుపత్రుల్లోని నివేదికలను పరిశీలించాలని ఆదేశించింది.  ఈ మేరకు మెడికల్ బోర్డును ఏర్పాటు చేసింది. 

రఘురామకృష్ణంరాజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దుష్ప్రచారం చేశారనే నెపంతో ఈ నెల 14వ తేదీ సాయంత్రం సీఐడీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 14వ తేదీన పోలీస్ కస్టడీలో ఉన్న సమయంలో తనను పోలీసులు తీవ్రంగా కొట్టారని ఎంపీ కోర్టుకు తెలిపారు. అంతేకాదు  తనను చిత్రహింసలకు గురి చేశారని లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే.  


 

click me!