అగ్రిగోల్డ్ కుంభకోణం: రూ.100 కోట్ల ఆస్తుల్ని జప్తు చేయనున్న సీఐడీ

Published : Jan 25, 2019, 09:33 AM ISTUpdated : Jan 25, 2019, 09:34 AM IST
అగ్రిగోల్డ్ కుంభకోణం: రూ.100 కోట్ల ఆస్తుల్ని జప్తు చేయనున్న సీఐడీ

సారాంశం

అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ వేగం పెంచింది. బాధితుల నుంచి నిరసనలు ఎక్కువ కావడంతో పాటు ప్రభుత్వం సైతం ఈ దిశగా దృష్టిపెట్టడంతో సీఐడీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యజమానుల బినామీలకు చెందిన 151 ఆస్తులను సీఐడీ గుర్తించింది. 

అగ్రిగోల్డ్ కుంభకోణంలో సీఐడీ వేగం పెంచింది. బాధితుల నుంచి నిరసనలు ఎక్కువ కావడంతో పాటు ప్రభుత్వం సైతం ఈ దిశగా దృష్టిపెట్టడంతో సీఐడీ కూడా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ క్రమంలో అగ్రిగోల్డ్ యజమానుల బినామీలకు చెందిన 151 ఆస్తులను సీఐడీ గుర్తించింది.

వీటి మార్కెట్ విలువ రూ.100 కోట్లు ఉంటుందని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా ఈ ఆస్తులన్నీ గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, అనంతపురం, విశాఖ జిల్లాల్లోనే ఉన్నట్లుగా తేలింది. ఈ ఆస్తులను జప్తుచేయటానికి సీఐడీ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

గతంలోనే అగ్రిగోల్డ్‌కు చెందిన ఆస్తులను ఈ-వేలం ద్వారా అమ్మేందుకు ప్రభుత్వం అనుమతినివ్వగా.. తాజాగా ఈ 151 ఆస్తులను సైతం ఆ జాబితాలోకి చేర్చాలని సీఐడీ భావిస్తోంది. మరోవైపు అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేయాలంటూ వైసీపీ సహా ప్రధాన ప్రతిపక్షాలు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తోన్న నేపథ్యంలో సీఐడీ దూకుడు ప్రాధాన్యత సంతరించుకుంది.  

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu