నరసరావుపేటలో వైసీపీ-టీడీపీ ఘర్షణ: రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

sivanagaprasad kodati |  
Published : Jan 25, 2019, 07:46 AM IST
నరసరావుపేటలో వైసీపీ-టీడీపీ ఘర్షణ: రాళ్లు రువ్వుకున్న ఇరువర్గాలు

సారాంశం

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోడెల శివరాం జన్మదిన వేడుకల్లో భాగంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందుగా ర్యాలీ వెళ్లింది. 

గుంటూరు జిల్లా నరసరావుపేటలో తెలుగుదేశం-వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. కోడెల శివరాం జన్మదిన వేడుకల్లో భాగంగా టీడీపీ శ్రేణులు ర్యాలీ నిర్వహించాయి. ఈ క్రమంలో వైసీపీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటి ముందుగా ర్యాలీ వెళ్లింది.

ఆ సమయంలో స్పీకర్ కోడెల శివప్రసాద్‌కు అనుకూలంగా నినాదాలు చేశారు. దీనికి ప్రతిగా వైసీపీ శ్రేణులు సైతం నినాదాలు చేయడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఘర్షణ తీవ్రంగా మారి ఇరువర్గాలు పరస్పరం గాల్లోకి రాళ్లు రువ్వుకున్నాయి.

ఈ ఘటనలో ముగ్గురు వైసీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు లాఠీఛార్జి చేసి ఇరువర్గాలను చెదరగొట్టారు. గాయపడిన వారిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనతో పట్టణంలో ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి.
 

PREV
click me!

Recommended Stories

మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu
పవన్‌ కళ్యాణ్‌.. 30వేల మంది మహిళలు ఏమయ్యారు? Vidadala Rajini Comments| Asianet News Telugu