మోడీ- పవన్ భేటీ... ఏం చర్చించనున్నారంటే, సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

Siva Kodati |  
Published : Nov 11, 2022, 03:50 PM ISTUpdated : Nov 11, 2022, 05:11 PM IST
మోడీ- పవన్ భేటీ... ఏం చర్చించనున్నారంటే, సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీకానుండటంపై ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కీలక వ్యాఖ్యలు చేశారు. తాము కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకమన్నారు. మోడీ- పవన్ భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయని సోము వీర్రాజు తెలిపారు. 

ప్రధాని నరేంద్ర మోడీతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ భేటీకానుండటంతో ఏపీ రాజకీయాలు వేడెక్కాయి. దీనిపై పలు పార్టీల నేతలు రకరకాలు స్పందిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు మాట్లాడుతూ.. తాము కుటుంబ, అవినీతి పార్టీలకు వ్యతిరేకమన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ తమ విధానం ఇలాగే వుంటుందని సోము వీర్రాజు స్పష్టం చేశారు. ప్రధానితో కోర్ కమిటీ జరిపే సభ్యుల సమావేశంలోనూ ఇదే చర్చ జరుగుతుందన్నారు. మోడీ- పవన్ భేటీలో రాజకీయ పరమైన అంశాలు చర్చకు వస్తాయని సోము వీర్రాజు తెలిపారు. 

ఇకపోతే...రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మోడీ- పవన్ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. 2014 ఏపీ అసెంబ్లీ ఎన్నికల సమయంలో టీడీపీ, బీజేపీపి కూటమికి పవన్ కల్యాణ్ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. మోదీ, పవన్ కల్యాణ్, చంద్రబాబులు కలిసి సభలలో పాల్గొని ప్రచారం నిర్వహించారు. ఆ ఎన్నికల్లో టీడీపీ-బీజేపీ కూటమి ఏపీలో అధికారంలో వచ్చింది. అయితే 2019కి వచ్చేసరికి ఆ సీన్ పూర్తిగా మారిపోయింది. ఎన్నికలకు కొన్ని నెలల ముందే ఎన్డీయే నుంచి టీడీపీ బయటకు వచ్చేసింది. 

Also REad:విశాఖలో మోదీతో భేటీ కానున్న పవన్ కల్యాణ్.. ఆ విషయాలపై క్లారిటీ రానుందా..?

మరోవైపు ఏపీ అభివృద్ది విషయంలో టీడీపీ, బీజేపీ తీరును పవన్ కల్యాణ్ విమర్శించారు. ఈ క్రమంలోనే ఎన్నికల్లో జనసేన, బీజేపీ, టీడీపీ వేర్వేరుగా పోటీ చేశాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ ఖాతా కూడా తెరవలేదు. టీడీపీకి 23 స్థానాలు, జనసేన ఒకచోట విజయం సాధించింది. ఆ తర్వాత చోటుచేసుకున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో.. 2020 జనవరిలో ఏపీలో జనసేన, బీజేపీ పొత్తు పెట్టకుంటున్నట్టుగా ప్రకటించారు. అప్పటి నుంచి ఆ రెండు పార్టీలు కలిసి ముందుకు సాగుతున్నాయి. అయితే రెండు పార్టీల పొత్తులో ఉన్నామని చెప్పుకోవడం తప్ప.. ఆ మేరకు ఇరు పార్టీల నాయకుల మధ్య సంబంధాలు ఉన్నట్టుగా కనిపించదు. 

కొందరు ఏపీ బీజేపీ నేతలు పవన్ కల్యాణ్‌ను ప్రశంసిస్తే.. మరికొందరు తాము ఆయనకు దూరమనే సంకేతాలు పంపుతుంటారు. అయితే 2019లో భారీ విజయంతో వైసీపీ అధికారంలో వచ్చి మూడేళ్లు అయిన తరుణంలో.. జనసేన, టీడీపీలు ఆ పార్టీపై విమర్శల దాడిని పెంచుతున్నాయి. ఎన్నికలకు మరో ఏడాదిన్నర సమయమే ఉండటంతో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా వైసీపీపై విమర్శలు చేసేందుకు వెనకాడటం లేదు. అయితే పవన్ కల్యాణ్ కనబరుస్తున్న దూకుడు మాత్రం బీజేపీ నేతల్లో కనిపించడం లేదనే చెప్పాలి. 

అయితే ఏపీలో కొన్ని నెలలుగా టీడీపీ, జనసేనల మధ్య పొత్తు చిగురించనుందనే ప్రచారం సాగుతుంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతు.. త్యాగాలకు సిద్దంగా ఉన్నామని ప్రకటించిన తర్వాత ఈ ప్రచారం మరింత ఎక్కువైంది. మరోవైపు వైసీపీ నేతలు కూడా జగన్‌ను సింగిల్‌గా ఎదుర్కొవడానికి రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీలు కలిసి వస్తాయనే.. దమ్ముంటే ఒంటిరిగా రావాలనే సవాళ్లు విసురుతున్నారు. అయితే టీడీపీ, జనసేన పార్టీల అగ్ర నాయకత్వం పొత్తులపై ఎలాంటి అధికారిక ప్రకటనలు చేయకపోవడంతో.. ఇరు పార్టీల క్యాడర్‌లో అయోమయం నెలకొంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్