Tirumala: రెండేళ్ల తర్వాత ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ.. పూర్తి వివరాలు ఇవే...

Published : Mar 21, 2022, 09:32 AM IST
Tirumala: రెండేళ్ల తర్వాత ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసిన టీటీడీ.. పూర్తి వివరాలు ఇవే...

సారాంశం

తిరుమల తిరుపతి దేవస్థానం (Tirumala Tirupati Devasthanams) శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ అందజేసింది. రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత శ్రీవారి ఆర్జిత సేవా టికెట్లను (Arjitha Seva tickets) ఆన్‌లైన్‌లో విడుదల చేసింది. 

రెండేళ్ల సుదీర్ఘ విరామం తర్వాత తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆదివారం ఆన్‌లైన్‌లో ఆర్జిత సేవా టిక్కెట్లను విడుదల చేసింది. టీటీడీ ఏప్రిల్ 1 నుంచి శ్రీవారి సేవలకు భక్తులకు అనుమతి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏప్రిల్, మే, జూన్‌ లకు సంబంధించిన ఆర్జిత సేవా టికెట్లను విడుదల చేసింది. భక్తులు తమ పేర్లను మార్చి 22 వరకు TTD అధికారిక వెబ్‌సైట్‌లో ఆర్జిత సేవల కోసం నమోదు చేసుకోవచ్చు. శ్రీవారికి సేవ చేసేందుకు తమకు నచ్చిన తేదీని భక్తులు ఎంచుకోవచ్చు.

సుప్రభాతం నుంచి ఏకాంత సేవ (పవళింపు సేవ) వరకు, సుప్రభాతం, తోమాల, అర్చన, కల్యాణోత్సవం, బ్రహ్మోత్సవం, డోలోత్సవం, సహస్ర దీపాలంకార సేవతో పాటు అష్టదళపాదపద్మారాధన, నిజపాద దర్శనం, సహస్ర కాళీశబ్ద సేవ వంటి వారపు సేవా టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మార్చి 22వ తేదీ ఉదయం 10 గంటలలోపు భక్తులు వారి పేర్లను నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. అనంతరం టికెట్లను ఆన్‌లైన్‌ ఎలక్ట్రానిక్‌ డిప్‌ విధానంలో కేటాయిస్తారు. 

శ్రీవారి సేవల కోసం ఎంపిక చేయబడిన భక్తుల వివరాలను వారికి ఎస్‌ఎంఎస్ ద్వారా పంపుతారు. అందులో భక్తుడు ఎంచుకున్న తేదీ, ఇతర వివరాలను పొందుపరుస్తారు. దీని ఆధారంగా భక్తులు తిరుమల యాత్రకు ప్లాన్ చేసుకోవచ్చు. 

మొత్తంగా.. 270 సుప్రభాతం టిక్కెట్లు, 10 అర్చన టిక్కెట్లు, 10 తోమాల, 60 అష్టదళ టిక్కెట్లు, 750 నిజ పాద దర్శనం టిక్కెట్లు, 475 కల్యాణోత్సవం, 150 ఊంజల సేవ, 275 ఆర్జిత బ్రహ్మోత్సవం టిక్కెట్లు, 275 ఆర్జిత బ్రహ్మోత్సవం, 600 సహస్రా దీపాలంకార సేవా టికెట్లను టీటీడీ ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవడానికి అందుబాటులో ఉంచింది.

ఏప్రిల్ నెలకు సంబంధించిన రూ. 300 స్పెషల్ దర్శనం టిక్కెట్ల కోటాను మార్చి 21 (సోమవారం) ఉదయం 10 గంటలకు టీటీడీ విడుదల చేయనుంది. ఇందుకు సంబంధించి టీటీడీ అడిషనల్ ఈవో ఏవీ ధర్మారెడ్డి మాట్లాడుతూ.. ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మార్చి 21, 22, 23 తేదీల్లో రోజుకు 25 వేల ప్రత్యేక ప్రవేశ దర్శన టిక్కెట్లను విడుదల చేస్తున్నామని తెలిపారు. భక్తులు తమ టిక్కెట్లను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవాలని కోరారు.

PREV
click me!

Recommended Stories

Vegetable Price : ఈ వారాంతం సంతలో కూరగాయల ధరలు ఎలా ఉండనున్నాయో తెలుసా?
IMD Cold Wave Alert : ఈ సీజన్లోనే కూలెస్ట్ మార్నింగ్స్ .. 14 జిల్లాల్లో ఆరెంజ్, 19 జిల్లాల్లో ఎల్లో అలర్ట్