ఏపీలో కరోనా డేంజర్ బెల్స్: 24 గంటల్లో మూడు వేలు దాటిన కేసులు, మొత్తం 9,25,401కి చేరిక

Published : Apr 11, 2021, 05:09 PM IST
ఏపీలో కరోనా డేంజర్ బెల్స్: 24 గంటల్లో మూడు వేలు దాటిన కేసులు, మొత్తం 9,25,401కి చేరిక

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 25వేల 401 కి చేరుకొన్నాయి. 

అమరావతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత 24 గంటల్లో3,495 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా కేసులు 9 లక్షల 25వేల 401 కి చేరుకొన్నాయి. గత 24 గంటల్లోరాష్ట్రంలో కరోనాతో తొమ్మిది మంది మరణించారు. కరోనాతో చిత్తూరులో నలుగురు, గుంటూరు, కర్నూల్, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం జిల్లాల్లో ఒక్కరి చొప్పున మరణించారు.  .దీంతో రాష్ట్రంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 7,300 కి చేరుకొంది.

రాష్ట్రంలో ఇప్పటివరకు 1,54,29,391 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో 31,719 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో3,495 మందికి కరోనా సోకినట్టుగా ప్రభుత్వం తెలిపింది. గత 24 గంటల్లో 1,198 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  ఏపీలో ఇప్పటివరకు 8 లక్షల 97 వేల 147 మంది కరోనా నుండి కోలుకొన్నారు.  రాష్ట్రంలో ఇంకా 20,954 యాక్టివ్ కేసులు ఉన్నట్టుగా వైద్య ఆరోగ్యశాఖ  ప్రకటించింది.

గత 24 గంటల్లో అనంతపురంలో 209, చిత్తూరులో 719,తూర్పుగోదావరిలో 041,గుంటూరులో 501, కడపలో 192,కృష్ణాలో 306, కర్నూల్ లో 191, నెల్లూరులో 190,ప్రకాశంలో 215, శ్రీకాకుళంలో 293, విశాఖపట్టణంలో 405, విజయనగరంలో 193,పశ్చిమగోదావరిలో 040కేసులు నమోదయ్యాయి. 

 రాష్ట్రంలో  వివిధ జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం -69,540 మరణాలు 609
చిత్తూరు  -94,160,మరణాలు 887
తూర్పుగోదావరి -1,25,817, మరణాలు 637
గుంటూరు  -82,043, మరణాలు 686
కడప  -56,866, మరణాలు 464
కృష్ణా  -52,817,మరణాలు 691
కర్నూల్  -63,063, మరణాలు 500
నెల్లూరు -65,013,మరణాలు 521
ప్రకాశం -63,735, మరణాలు 589
శ్రీకాకుళం -48,039,మరణాలు 350
విశాఖపట్టణం  -64,708,మరణాలు 586
విజయనగరం  -41,970, మరణాలు 238
పశ్చిమగోదావరి -94,735, మరణాలు 542

 

 


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు
IMD Cold Wave Alert : గజగజా వణికిపోతున్న తెలుగు రాష్ట్రాలు... ఈ చలి తీవ్రత తగ్గేదెన్నడో తెలుసా?