తూ.గోలో కొనసాగుతున్న కరోనా ఉధృతి: ఏపీలో మొత్తం కరోనా కేసులు19,83,721 కి చేరిక

By narsimha lodeFirst Published Aug 9, 2021, 5:28 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తూర్పు గోదావరి సహా కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి తగ్గడం లేదు.  గత 24 గంటల్లో 1413 కరోనా కేసులు నమోదయ్యాయి. 

అమరావతి:ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టాయి. కానీ కొన్ని జిల్లాల్లో కరోనా కేసుల ఉధృతి కొనసాగుతూనే ఉంది.గత 24 గంటల్లో 54,455 మంది శాంపిల్స్ ను పరీక్షిస్తే 1413  మందికి కరోనా నిర్ధారణ అయింది. దీంతోరాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 19,83,721 కి చేరుకొంది.నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 18 మంది మృత్యువాతపడ్డారు. దీంతో  రాష్ట్రంలో మొత్తం  కరోనా మరణాల సంఖ్య 13,549కి చేరింది. 

గడిచిన 24 గంటల్లో 1795 మంది కోవిడ్‌ నుంచి కోలుకొన్నారు. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా నుండి 19 లక్షల 50వేల 623  మంది కోలుకొన్నారు. ఏపీలో ప్రస్తుతం 19,549యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,52,47,884 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో అనంతపురంలో016,చిత్తూరులో 201, తూర్పుగోదావరిలో458, గుంటూరులో095,కడపలో 075, కృష్ణాలో113, కర్నూల్ లో009, నెల్లూరులో207, ప్రకాశంలో 094,విశాఖపట్టణంలో 045, శ్రీకాకుళంలో052, విజయనగరంలో 016, పశ్చిమగోదావరిలో 032కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటల్లో కరోనాతో  18 మంది చనిపోయారు. చిత్తూరులో ఐదుగురు, కృష్ణాలో ముగ్గురు, తూర్పుగోదావరి, గుంటూరు, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో ఇద్దరు చొప్పున మరణించారు. శ్రీకాకుళం, విశాఖపట్టణం జిల్లాల్లో ఒక్కరి చొప్పున చనిపోయారు.దీంతో రాష్ట్రంలో  కరోనాతో మరణించిన వారి సంఖ్య 13,549కి చేరుకొంది.

 
ఏపీలో పలు జిల్లాల్లో నమోదైన కేసులు, మరణాలు

అనంతపురం-1,56,594, మరణాలు 1088
చిత్తూరు-2,33,828, మరణాలు1772
తూర్పుగోదావరి-2,80,901, మరణాలు 1229
గుంటూరు -1,69,574,మరణాలు 1161
కడప -1,11,149, మరణాలు 627
కృష్ణా -1,10,863,మరణాలు 1244
కర్నూల్ - 1,23,503,మరణాలు 844
నెల్లూరు -1,36,313,మరణాలు 969
ప్రకాశం -1,31,268, మరణాలు 1020
శ్రీకాకుళం-1,21,094, మరణాలు 769
విశాఖపట్టణం -1,53,258 మరణాలు 1088
విజయనగరం -81,666, మరణాలు 669
పశ్చిమగోదావరి-1,70,815, మరణాలు 1069

 

: 09/08/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 19,80,826 పాజిటివ్ కేసు లకు గాను
*19,47,728 మంది డిశ్చార్జ్ కాగా
*13,549 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 19,549 pic.twitter.com/r0PctBFrN8

— ArogyaAndhra (@ArogyaAndhra)


 

click me!