గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

Published : Mar 13, 2024, 01:22 PM ISTUpdated : Mar 13, 2024, 01:33 PM IST
గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష రద్దు: ఏపీ హైకోర్టు కీలక తీర్పు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  ఇవాళ గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలకు సంబంధించి  కీలక తీర్పును వెల్లడించింది.  

అమరావతి: ఏపీపీఎస్‌‌సీ 2018లో నిర్వహించిన  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షను  ఆంధ్రప్రదేశ్ హైకోర్టు  రద్దు చేసింది. ఈ మేరకు  ఏపీ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది.

also read:గీతాంజలి మృతిపై రాజకీయరంగు: టీడీపీ, వైఎస్ఆర్‌సీపీ మాటల యుద్ధం, ఎవరి వాదన వారిదే...

గ్రూప్-1 పరీక్షలపై కొందరు ఆంధ్రప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించారు. దరిమిలా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు బుధవారం నాడు కీలక తీర్పును వెల్లడించింది.గ్రూప్-1 పరీక్ష పేపర్ల మూల్యాంకనం విషయంలో  కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు.

also read:వెరైటీ పెళ్లి పత్రిక: విత్తనాలను పంచుతున్న ఆదిలాబాద్ వాసి

జవాబు పత్రాలను  ఒకటి కంటే ఎక్కువ దఫాలు  మూల్యాంకనం చేయడాన్ని చట్టవిరుద్దమని  హైకోర్టు పేర్కొంది.  గ్రూప్-1 మెయిన్స్ పరీక్షకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను రద్దు చేయాలని  ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. మరో వైపు  పరీక్ష నిర్వహణ,అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను  ఆరు వారాల్లో పూర్తి చేయాలని ఉన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.ఇదిలా ఉంటే గ్రూప్-1 పై హైకోర్టు ఇచ్చిన తీర్పుపై అప్పీల్ కు వెళ్లే యోచనలో ప్రభుత్వం ఉందని సమాచారం.

also read:లైవ్‌లోనే సహోద్యోగికి ప్రపోజ్: వైరలైన వీడియో

తెలంగాణ రాష్ట్రంలో కూడ గ్రూప్-1 పరీక్షలను రద్దు చేసిన విషయం తెలిసిందే.  గ్రూప్ -1 పరీక్షపేపర్లు లీకయ్యాయి.ఈ విషయం వెలుగు చూడడంతో  గ్రూప్ 1 పరీక్షలను రద్దు చేశారు.ఆ తర్వాత నిర్వహించిన పరీక్ష విషయంలో  నిబంధనలు పాటించలేదని కొందరు అభ్యర్థులు  హైకోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై విచారణ జరిపిన హైకోర్టు పరీక్షలను రద్దు చేసింది.  తాజాగా గ్రూప్ 1పరీక్షల నిర్వహణకు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే.

 

 

PREV
click me!

Recommended Stories

నారా భువనేశ్వరి ఇంగ్లీష్ స్పీచ్ కి మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్ షాక్| Asianet News Telugu
Nimmala Rama Naidu Pressmeet: ఉగ్రవాదులకంటే ఉన్మాదం జగన్ పై రెచ్చిపోయిన నిమ్మల | Asianet News Telugu