హనుమంతుడి జన్మస్థలంపై వివాదం: టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ల మధ్య చర్చలు

Published : May 27, 2021, 11:48 AM IST
హనుమంతుడి జన్మస్థలంపై వివాదం: టీటీడీ, కిష్కింధ సంస్థాన్ ల మధ్య చర్చలు

సారాంశం

 హనుమంతుడి జన్మస్థలంపై మరోసారి వివాదం  కొనసాగుతోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ  గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను  కర్ణాటకలోని కిష్కింద సంస్థానం తోసిపుచ్చింది. దీంతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీతో  కిష్కింధ సంస్థానం ప్రతినిధులు గురువారం నాడు చర్చిస్తున్నారు.

తిరుపతి: హనుమంతుడి జన్మస్థలంపై మరోసారి వివాదం  కొనసాగుతోంది. తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ  గతంలో ప్రకటించింది. అయితే ఈ ప్రకటనను  కర్ణాటకలోని కిష్కింద సంస్థానం తోసిపుచ్చింది. దీంతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీతో  కిష్కింధ సంస్థానం ప్రతినిధులు గురువారం నాడు చర్చిస్తున్నారు.

 టీటీడీ రాష్ట్రీయ సంస్కృత పీఠంలో గురువారం నాడు ఈ విషయమై కిష్కింధ సంస్థాన ప్రతినిధులతో టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ ప్రతినిధులు చర్చిస్తున్నారు. కిష్కింధ సంస్థానం తరపున శ్రీ హనుమద్ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్టు వ్యవస్థాపకులు గోవిందానంద సరస్వతి  ఈ చర్చల్లో పాల్గొన్నారు

also read:హనుమంతుడి జన్మస్థలం తిరుమల అంజనాద్రే: టీటీడీ

టీటీడీ తరపున సంస్కృత యూనివర్శిటీ వీసీతో పాటు టీటీడీ ఏర్పాటు చేసిన కమిటీ సభ్యులు  ఈ చర్చలో పాల్గొన్నారు. హనుమంతుడి జన్మస్థలం తిరుమలలోని అంజనాద్రేనని టీటీడీ బృందం, కిష్కింధలోని అంజనాద్రే వాయుపుత్రుడి పుట్టిన స్థలమని వాదిస్తున్నారు. ఈ చర్చల తర్వాత చర్చల సారాంశాన్ని ప్రకటించే అవకాశం ఉంది. గత నెలలోనే తిరుమలలోని అంజనాద్రే హనుమంతుడి జన్మస్థలమని టీటీడీ ప్రకటించింది.ఈ మేరకు తాము సేకరించిన ఆధారాలను టీటీడీ నియమించిన కమిటీ మీడియాకు తెలిపింది. 


 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
IMD Cold Wave Alert : అధికపీడనం ఎఫెక్ట్.. కుప్పకూలిన టెంపరేచర్స్, ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం