ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ

Published : Mar 02, 2024, 11:01 AM IST
 ఏపీలో బీజేపీ కోర్‌కమిటీ భేటీ: అభ్యర్థుల ఎంపిక, కీలకాంశాలపై చర్చ

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ నేతలు  ఇవాళ, రేపు సమావేశం కానున్నారు.రానున్న ఎన్నికల విషయమై కమలం పార్టీ కసరత్తు చేస్తుంది.


అమరావతి: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖకు చెందిన ఎన్నికల కోర్ కమిటీ  శనివారం నాడు  భేటీ కానుంది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  ఆ పార్టీ  కసరత్తు చేసే అవకాశం లేకపోలేదు.

also read:12 స్థానాల్లో ఒక్క పేరు: లోక్‌సభ ఎన్నికలపై తెలంగాణ కాంగ్రెస్ ఫోకస్

రెండు రోజుల పాటు  ఈ కోర్ కమిటీ సమావేశాలు జరగనున్నాయి. పార్టీ  కీలక నేతలు ఈ సమావేశంలో పాల్గొంటారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో  పొత్తులపై  భారతీయ జనతా పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకుంటుందని  బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు  పురంధేశ్వరి ప్రకటించారు. 

also read:రెండో జాబితాపై టీడీపీ-జనసేన కసరత్తు: సీనియర్లకు చోటు?

రాష్ట్రంలోని  175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాల్లో పోటీ చేసేందుకు  సుమారు  2, 500 మంది ధరఖాస్తు చేసుకున్నారు. ఈ ధరఖాస్తులను బీజేపీ త్రిసభ్య కమిటీ  పరిశీలించనుంది. ధరఖాస్తు చేసుకున్న ఆశావాహుల నుండి  అప్లికేషన్లను  పరిశీలించి బీజేపీ కేంద్ర కమిటీకి పంపనున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాపై  బీజేపీ కేంద్ర నాయకత్వం  కసరత్తు చేస్తుంది. రెండు రోజుల్లో ఈ జాబితాను  ప్రకటించే అవకాశం ఉంది. తొలి జాబితాలో తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఆరు నుండి పది మందికి చోటు దక్కే అవకాశం లేకపోలేదు.

also read:బీఆర్ఎస్‌కు షాక్: బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బి.బి.పాటిల్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో  తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై ఇంకా స్పష్టత రాలేదు. గత మాసంలో  బీజేపీ నేతలతో చంద్రబాబు చర్చలు జరిపారు. ఆ మరునాడే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో ఏపీ సీఎం వై.ఎస్. జగన్ భేటీ అయ్యారు.  తెలుగుదేశం-జనసేన కూటమిలో బీజేపీ చేరుతుందా లేదా అనే విషయమై  ఈ వారంలో తేలే అవకాశం ఉందనే ప్రచారం లేకపోలేదు.  ఈ  విషయమై  స్పష్టత వస్తే   మిగిలిన  స్థానాల్లో  అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది.టీడీపీ, జనసేన అభ్యర్థుల జాబితాలను ఇటీవల విడుదల చేశారు. రెండో జాబితాను కూడ విడుదల చేసేందుకు  రెండు పార్టీల నేతలు కసరత్తు చేస్తున్నారు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

YSRCP Leaders Protest in Vijayawada | Demand Removal of TTD Chairman B R Naidu | Asianet News Telugu
Taneti Vanitha Comments on Pawan:తాట తీస్తా అన్నావ్.. ఏమైపోయావ్ పవన్ కళ్యాణ్ | Asianet News Telugu