మార్చి 14 నుండి ఏపీ అసెంబ్లీ సమావేశాలు

Published : Feb 24, 2023, 02:18 PM IST
 మార్చి  14 నుండి  ఏపీ  అసెంబ్లీ సమావేశాలు

సారాంశం

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి  14 నుండి ప్రారంభం కానున్నాయి.  ఈ బడ్జెట్ సమావేశాలను గవర్నర్ అబ్దుల్ నజీర్ ప్రారంభించనున్నారు. 

అమరావతి: ఈ ఏడాది మార్చి  14  నుండి ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు  ప్రారంభం కానున్నాయి. ఏపీలో  అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు  అనుమతివ్వాలని కోరుతూ  ప్రభుత్వం  గవర్నర్ కు  శుక్రవారం నాడు  ప్రతిపాదనలు పంపింది. దీనికి  ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్  గ్రీన్ సిగ్నల్  ఇచ్చారు. ఇవాళ ఉదయమే  అబ్దుల్ నజీర్  ఏపీ గవర్నర్ గా  బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే.

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను  కనీసం  13 రోజుల పాటు  నిర్వహించనున్నారు. ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలను  మార్చి  14న  గవర్నర్ ప్రసంగంతో  ప్రారంభం కానున్నాయి.   గవర్నర్ ప్రసంగం  తర్వాత  నిర్వహించే  బీఏసీ సమావేశంలో  అసెంబ్లీ  పని దినాలపై  నిర్ణయం తీసుకోనున్నారు. 

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టనున్న బడ్జెట్ లో  సంక్షేమ పథకాలకు  పెద్దపీట  వేసే అవకాశం ఉంది.  వచ్చే ఏడాది  ఏపీ రాష్ట్రంలో  అసెంబ్లీ ఎన్నికలు  ఉన్నాయి.  ఎన్నికలను దృష్టిలో  ఉంచుకొని  రాష్ట్ర ప్రభుత్వం  ప్రజలకు  సంక్షేమ పథకాలకు పెద్ద పీట  వేసే అవకాశం లేకపోలేదు.
 

PREV
click me!

Recommended Stories

సీనియర్ TDP కార్యకర్తబిళ్ల సత్యనారాయణను పరామర్శించిన లోకేష్ | Nara Lokesh Visits Penamaluru
Heavy Rain Alert : తీవ్ర వాయుగుండం దెబ్బకు ఈ మూడ్రోజుల్లో 100-120 మి.మీ వర్షం కురుస్తుందా..! ఈ 17 జిల్లాలకు రెడ్ అలర్ట్