కేంద్ర మంత్రి అమిత్ షా టూర్: శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు

Published : Aug 12, 2021, 03:39 PM IST
కేంద్ర మంత్రి అమిత్ షా టూర్: శ్రీశైలం ఆలయంలో ప్రత్యేక పూజలు

సారాంశం

 శ్రీశైలం ఆలయంలో కుటుంబసభ్యులతో కలిసి  కేంద్ర మంత్రి అమిత్ షా ప్రత్యేక పూజలు చేశారు.ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ సహా పలువురు ప్రజాప్రతినిధులు అమిత్ షాకు స్వాగతం పలికారు.

శ్రీశైలం: కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గురువారం నాడు కుటుంబసభ్యులతో కలిసి శ్రీశైలం భ్రమరాంబ మల్లిఖార్జునస్వామని దర్శించుకొన్నారు. ఏపీ దేవాదాయశాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, పలువురు ప్రజా ప్రతినిధులు ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఆలయంలో ఆయన ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు.

also read:తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా టూర్: శ్రీశైలంలో ప్రత్యేక పూజలు

ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాత శ్రీశైలం గెస్ట్‌హౌజ్‌లో కేంద్ర మంత్రి మధ్యాహ్న భోజనం ముగించారు. ఆలయంలో పూజలు ముగించుకొన్న తర్వాత ఆయన హైద్రాబాద్ కు  తిరిగి వచ్చారు. హైద్రాబాద్ నుండి ఆయన ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళ్లారు.లోక్‌సభ వాయిదా పడిన మరునాడే ఆయన శ్రీశైలం మల్లన్నను దర్శించుకొనేందుకు వచ్చారు.

 


 

PREV
click me!

Recommended Stories

CM Chandrababu Pressmeet: పోలవరం ప్రాజెక్ట్ పనుల పైసీఎం చంద్రబాబు కీలక ప్రెస్ మీట్ | Asianet Telugu
పోలవరం ప్రాజెక్ట్ పనులు పరిశీలించిన సీఎం చంద్రబాబు | CM Chandrababu Reviews Polavaram Project Works