బెజవాడ కనకదుర్గ ఆలయంలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

Published : Feb 19, 2021, 01:02 PM IST
బెజవాడ కనకదుర్గ ఆలయంలో రెండో రోజూ కొనసాగుతున్న ఏసీబీ సోదాలు

సారాంశం

విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.నిన్నటి నుండి అధికారులు ఈ ఆలయంలో సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.

విజయవాడ: విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుక్రవారం నాడు కూడా ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.నిన్నటి నుండి అధికారులు ఈ ఆలయంలో సోదాలు చేస్తున్న విషయం తెలిసిందే.

 ఐదు బృందాలతో కూడ ఏసీబీ అధికారుల బృందం రెండు రోజులుగా సోదాలు నిర్వహిస్తోంది. కృష్ణా, గుంటూరు జిల్లాలకు చెందిన అధికారులు సంయుక్తంగా ఈ సోదాలు చేపట్టారు. 

టిక్కెట్టు , చీరల కౌంటర్, స్టోర్స్ పరిపాలన విభాగంలో కీలక ఆధారాలను ఏసీబీ అధికారులు సేకరించారు. అడ్మినిస్ట్రేషన్ విభాగంలో రికార్డులు, కంప్యూటర్ హర్డ్ డిస్కులను ఏసీబీ అధికారులు పూర్తిగా పరిశీలిస్తున్నారు.

అమ్మవారికి భక్తులు సమర్పించిన వేలాది చీరలను ఆలయ సిబ్బంది దొంగిలిస్తున్నారని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ విషయాలపై ఏసీబీ అధికారులు ఆలయ అధికారుల నుండి వివరాలను సేకరిస్తున్నారు. 

ఏళ్ల తరబడి ఆలయంలోనే పనిచేస్తున్న సిబ్బంది వివరాలను కూడ ఏసీబీ సేకరిస్తోంది. అంతర్గత బదిలీలతో ఈ దేవాలయంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగుల సమాచారాన్ని కూడ ఏసీబీ అధికారులు సేకరిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎంటెక్ చదివి కలెక్టర్‌గా ఎదిగి.. ఏపీ కొత్త సీఎస్ సాయి ప్ర‌సాద్ నేప‌థ్యం ఏంటో తెలుసా.?
IMD Rain Alert : సముద్రంలో భయంకర తుపాను.. ఈ తెలుగు జిల్లాల్లో వర్షాలు, ఎల్లో అలర్ట్