వారం క్రితం 9 ఏళ్ల తనీష్ కిడ్నాప్: కడప వెంగలాయపల్లెల్లో డెడ్‌బాడీ లభ్యం

Published : Aug 10, 2021, 10:50 AM IST
వారం క్రితం  9 ఏళ్ల తనీష్ కిడ్నాప్: కడప వెంగలాయపల్లెల్లో డెడ్‌బాడీ లభ్యం

సారాంశం

వారం రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన తనీష్ అనే 9 ఏళ్ల బాలుడు హత్యకు గురయ్యాడు. కడప జిల్లాలోని రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో తనీష్ డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు.

కడప: వారం రోజుల క్రితం కిడ్నాప్‌నకు గురైన  తొమ్మిదేళ్ల తనీష్‌ను గుర్తు తెలియని వ్యక్తులు  కిడ్నాప్ చేశారు. తనీష్ ను వదిలిపెట్టాలంటే రూ.  8 లక్షలు ఇవ్వాలని కిడ్నాపర్లు డిమాండ్ చేశారు. ఈ మేరకు డిమాండ్లతో కూడిన లేఖను గ్రామంలో వదిలిపెట్టారు. తనీష్ తండ్రి డబ్బులను సమకూర్చుకొంటున్నాడు. ఈ తరుణంలో తనీష్ డెడ్‌బాడీ లభ్యమైంది. వారం రోజుల తర్వాత తనీష్ మృతదేహం లభ్యం కావడంతో  తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.కడప జిల్లాలోని రాజుపాలెం మండలం వెంగలాయపల్లెలో ఈ ఘటన చోటు చేసుకొంది.  

గ్రామంలోని అంకాలమ్మగుడి సమీపంలో తనీష్‌ ను గొంతుకోసి హత్య చేశారు.  ఈ గుడికి సమీపంలోని ముళ్లపొదల్లో డెడ్‌బాడీని పోలీసులు గుర్తించారు.క్షుద్రపూజల కోసమే తన కొడుకును చంపేసి ఉంటారని తనీష్ తండ్రి ఆరోపిస్తున్నారు. తన కొడుకును దారుణంగా హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు.


 

PREV
click me!

Recommended Stories

పిచ్చుకులంకలో సీఎం చంద్రబాబు పవర్ ఫుల్ స్పీచ్ | CM Chandrababu Naidu Speech at Dowleswaram Barrage
నేతన్నలకు కూటమి సర్కార్ గుడ్ న్యూస్ ఒక్కొక్కరి ఖాతాలోకి రూ. 25వేలు| Asianet News Telugu