ఏపీ : కొత్తగా 865 మందికి పాజిటివ్... 20,49,103కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

Siva Kodati |  
Published : Oct 02, 2021, 05:51 PM ISTUpdated : Oct 02, 2021, 05:54 PM IST
ఏపీ : కొత్తగా 865 మందికి పాజిటివ్... 20,49,103కి చేరిన మొత్తం కేసుల సంఖ్య

సారాంశం

ఏపీలో కొత్తగా 865 కరోనా కేసులు నమోదవ్వగా.. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 1,424 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 10,574 మంది చికిత్స పొందుతున్నారు

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు మరోసారి 1000లోపే నమోదయ్యయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 865 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,49,103కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 9 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 14,195కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల చిత్తూరు 3, కృష్ణ 2, గుంటూరు 2, ప్రకాశంలో ఇద్దరు చొప్పున మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 1,424 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,24,334కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 50,304 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,84,00,471కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 10,574మంది చికిత్స పొందుతున్నారు. 

నిన్న ఒక్కరోజు అనంతపురం 7, చిత్తూరు 168, తూర్పుగోదావరి 172, గుంటూరు 117, కడప 23, కృష్ణ 75, కర్నూలు 4, నెల్లూరు 75, ప్రకాశం 90, శ్రీకాకుళం 4, విశాఖపట్నం 35, విజయనగరం 15, పశ్చిమ గోదావరిలలో 80 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.

 

PREV
click me!

Recommended Stories

ఈ రాష్ట్రాలకు అన్యాయం జరగదు..మహిళా రిజర్వేషన్ బిల్లు పై Chandrababu Reaction | Asianet News Telugu
మహిళా రిజర్వేషన్ బిల్లు పై Pamula Pushpa Srivani Reaction | Women Reservation | Asianet News Telugu