కుప్పంలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

Published : Jun 16, 2018, 10:36 PM IST
కుప్పంలో రోడ్డు ప్రమాదం: ఏడుగురు మృతి, పలువురికి గాయాలు

సారాంశం

లోయలోపడిన లారీ

చిత్తూరు: చిత్తూరు జిల్లా కుప్పం మండలంలోని పెద్దవంక సమీపంలో   శనివారం రాత్రి ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. మామిడికాయలతో లోడుతో వెళుతున్న లారీ లోయలోపడిన ఘటనలో ఏడుగురు మృతిచెందారు. పలువురు గాయపడ్డారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలను చేపట్టారు.

లారీ కింద సుమారు 10 మంది ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. దట్టమైన అటవీ ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకొంది. చనిపోయినవారంతా తమిళనాడుకు చెందిన కూలీలుగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : అల్పపీడనానికి తోడైన ఉపరితల ద్రోణి.. ఈ ప్రాంతాల్లో భారీ వర్షాలు, ఇక అల్లకల్లోలమే
Rajamahendravaram Milk adulterated: కల్తీ పాలు వినియోగించిన వారి ఆరోగ్య పరిస్థితి| Asianet Telugu