చిత్తూరులో మళ్లీ పెరిగిన మరణాలు: ఏపీలో కొత్తగా 5646 కేసులు, తూ.గోలో అత్యధికం

Siva Kodati |  
Published : Jun 20, 2021, 05:47 PM IST
చిత్తూరులో మళ్లీ పెరిగిన మరణాలు: ఏపీలో కొత్తగా 5646 కేసులు, తూ.గోలో అత్యధికం

సారాంశం

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,646 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,47,668కి చేరుకుంది

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల్లో తగ్గుదల కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 5,646 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 18,47,668కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 50 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 12,319కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి  ప్రకాశం 3, అనంతపురం 3, తూర్పుగోదావరి 5, చిత్తూరు 11, గుంటూరు 6, కర్నూలు 2, నెల్లూరు 1, కృష్ణ 3, విశాఖపట్నం 2, శ్రీకాకుళం 4, పశ్చిమ గోదావరి 7, కడపలో ముగ్గురు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 7,772 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 17,72,281కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 1,00,001మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,11,50,847కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 63,068మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 386, చిత్తూరు 890, తూర్పుగోదావరి 1098, గుంటూరు 309, కడప 307, కృష్ణ 441, కర్నూలు 127, నెల్లూరు 213, ప్రకాశం 387, శ్రీకాకుళం 396, విశాఖపట్నం 176, విజయనగరం 156, పశ్చిమ గోదావరిలలో 761 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.


 

PREV
click me!

Recommended Stories

Vietnam Boat Accident: వియత్నాంలో బోటు ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో విషాదం. అసలేం జరిగిందంటే.?
Corona In AP: ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా క‌ల‌క‌లం.. మ‌ర‌ణాల‌తో అప్ర‌మ‌త్త‌మైన ప్ర‌భుత్వం.