శుభకార్యానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి

Published : Jul 05, 2018, 04:43 PM IST
శుభకార్యానికి వెళ్లివస్తుండగా రోడ్డు ప్రమాదం, ఐదుగురి మృతి

సారాంశం

శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురై ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారును ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  అనంతపురం జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.  

శుభకార్యానికి వెళ్లి తిరిగివస్తుండగా ప్రమాదానికి గురై ఐదుగురు యువకులు మృత్యువాత పడ్డారు. వారు ప్రయాణిస్తున్న కారు ను ఎదురుగా వచ్చిన లారీ వేగంగా ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది.  అనంతపురం జిల్లాలో ఈ విషాద సంఘటన చోటుచేసుకుంది.  

ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. బెంగుళూరులోని బయ్యప్పనహళ్లికి చెందిన మురళీ(20), మంజునాథ్‌(24), దినేష్‌(24), రామ్మోహన్‌ (22), శివప్రసాద్‌(25) లు పావగడలో  ఓ శుభకార్యానికి హాజరయ్యారు. ఉదయం కారులో కలిసి వచ్చిన వీరు తిరిగి అదే కారులో సాయంత్రం బెంగళూరుకు బయలుదేరారు. అయితే తిరుగు ప్రయాణంలో వీరు ప్రయాణిస్తున్న కారు మధుగిరి సమీపంలోని కెరెగల పాళ్య వద్ద ఓ లోడ్ లారీని ఢీకొట్టింది. 

చాలా వేగంతో ఎదురెదురుగా వచ్చి  ఒకదానినొకటి ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. దీంతో అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు ప్రమాద స్థలంలోనే మృతి చెందారు. 

ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.
 

PREV
click me!

Recommended Stories

Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu
Palla Srinivas on Lokesh Birthday: లోకేష్అంటే నమ్మకం.. నిత్యంప్రజల్లోనే ఉంటారు | Asianet News Telugu