ఏపీలో కొత్తగా 2,974 మందికి పాజిటివ్... చిత్తూరులో, ప్రకాశం జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

Siva Kodati |  
Published : Jul 18, 2021, 05:36 PM IST
ఏపీలో కొత్తగా 2,974 మందికి పాజిటివ్... చిత్తూరులో, ప్రకాశం జిల్లాల్లో పెరుగుతున్న కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 2,974 కరోనా కేసులు నమోదవ్వగా.. 17 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 3,290 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,708 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,974 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,37,201కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 17 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,132కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 3, ప్రకాశం 5,  అనంతపురం 2 , కృష్ణ 3, నెల్లూరు 1, విశాఖపట్నంలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 3,290 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 18,99,361కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 10,05,024 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,35,93,055కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 24,708 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 98, చిత్తూరు 501, తూర్పుగోదావరి 577, గుంటూరు 179, కడప 106, కృష్ణ 311, కర్నూలు 65, నెల్లూరు 282, ప్రకాశం 349, శ్రీకాకుళం 73, విశాఖపట్నం 120, విజయనగరం 33, పశ్చిమ గోదావరిలలో 280 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.  


 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : హిందూ మహాసముద్రం తుపాను.. భారీ నుండి అతిభారీ వర్షాలు, ప్లాష్ ప్లడ్స్ అల్లకల్లోలం
CM Chandrababu Naidu: జిల్లా కలెక్టర్లకు సీఎం కీలక ఆదేశాలు| Asianet News Telugu