ఏపీ: 24 గంటల్లో 286 మందికి పాజిటివ్.. 20,65,026కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

Siva Kodati |  
Published : Nov 11, 2021, 07:16 PM IST
ఏపీ: 24 గంటల్లో 286 మందికి పాజిటివ్.. 20,65,026కి చేరిన సంఖ్య, చిత్తూరులో అత్యధికం

సారాంశం

ఏపీలో కొత్తగా 286 కరోనా కేసులు (corona cases in ap) నమోదవ్వగా.. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 307 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,196 మంది చికిత్స పొందుతున్నారు.

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. (corona cases in ap) గడిచిన 24 గంటల్లో 286 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 20,66,457కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా (corona deaths in ap) మరణించిన వారి సంఖ్య 14,409కి చేరుకుంది. 

గడిచిన 24 గంటల్లో కోవిడ్ వల్ల కృష్ణా, చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాలో ఒక్కొక్కరు మృతిచెందారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 307 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 20,48,852కు చేరింది. గత 24 గంటల వ్యవధిలో 37,540 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,98,84,230కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 3,196 మంది చికిత్స పొందుతున్నారు. నిన్న ఒక్కరోజు అనంతపురం 14, చిత్తూరు 53, తూర్పుగోదావరి 36, గుంటూరు 30, కడప 12, కృష్ణ 34, కర్నూలు 4, నెల్లూరు 15, ప్రకాశం 7, శ్రీకాకుళం 11, విశాఖపట్నం 36, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో 33 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు.
 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu