ఏపీ: కొత్తగా 2527 మందికి పాజిటివ్.. 19,43,854కి చేరిన మొత్తం కేసులు

Siva Kodati |  
Published : Jul 21, 2021, 07:43 PM ISTUpdated : Jul 21, 2021, 07:49 PM IST
ఏపీ: కొత్తగా 2527 మందికి పాజిటివ్.. 19,43,854కి చేరిన మొత్తం కేసులు

సారాంశం

ఏపీలో కొత్తగా 2,527 కరోనా కేసులు నమోదవ్వగా.. 19 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,412 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 23,939 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,527 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,43,854కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 19 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,197కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి తూర్పుగోదావరి 2, చిత్తూరు 4, ప్రకాశం 2,  అనంతపురం 2 , కృష్ణ 3, నెల్లూరు 3, పశ్చిమ గోదావరి 2,  కడప, విశాఖపట్నం, శ్రీకాకుళంలో ఒక్కరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,412 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,06,718కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 86,280 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,38,38,636కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 23,939 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 69, చిత్తూరు 318, తూర్పుగోదావరి 515, గుంటూరు 182, కడప 111, కృష్ణ 249, కర్నూలు 61, నెల్లూరు 206, ప్రకాశం 303, శ్రీకాకుళం 49, విశాఖపట్నం 133, విజయనగరం 43, పశ్చిమ గోదావరిలలో 288 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

RK Roja Comments on TTD Chairman BR Naidu బీఆర్ నాయుడుపై ఓ రేంజ్ లో రెచ్చిపోయిన రోజా| Asianet Telugu
Tirumala Temple Reopens After Lunar Eclipse: చంద్రగ్రహణం అనంతరం తెరుచుకున్న తిరుమల | Asianet Telugu