ఏపీలో కొత్తగా 2442 మందికి పాజిటివ్.... చిత్తూరు, తూ.గోదావరిలో అనూహ్య పెరుగుదల

Siva Kodati |  
Published : Aug 04, 2021, 08:37 PM IST
ఏపీలో కొత్తగా 2442 మందికి పాజిటివ్.... చిత్తూరు, తూ.గోదావరిలో అనూహ్య పెరుగుదల

సారాంశం

ఏపీలో కొత్తగా 2,442 కరోనా కేసులు నమోదవ్వగా.. 16 మంది ప్రాణాలు కోల్పోయారు. నిన్న ఒక్కరోజు 2,412 మంది కోలుకోగా.. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,184 మంది చికిత్స పొందుతున్నారు.  

ఆంధ్రప్రదేశ్‌‌‌లో కరోనా కేసులు స్వల్పంగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో కొత్తగా 2,442 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటి వరకు వైరస్ బారినపడిన వారి సంఖ్య 19,71,101కి చేరుకుంది. నిన్న ఒక్కరోజు ఈ మహమ్మారి వల్ల 16 మంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఏపీలో ఇప్పటి వరకు వైరస్ కారణంగా మరణించిన వారి సంఖ్య 13,444కి చేరుకుంది.

గత 24 గంటల వ్యవధిలో కోవిడ్ బారినపడి అనంతపురం 2, తూర్పుగోదావరి 1, చిత్తూరు 5, కృష్ణ 2, గుంటూరు 1, విశాఖపట్నం 1, కడప 1, కర్నూలు 1, నెల్లూరులో ఇద్దరు చొప్పున మరణించారు. నిన్న ఒక్కరోజు కరోనా నుంచి 2,412 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటి వరకు ఏపీలో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 19,37,473కి చేరింది. గత 24 గంటల వ్యవధిలో 85,822 మంది శాంపిల్స్‌ను పరీక్షించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 2,48,63,968కి చేరుకుంది. ప్రస్తుతం ఏపీలోని వివిధ ఆసుపత్రుల్లో 20,184 మంది చికిత్స పొందుతున్నారు.

నిన్న ఒక్కరోజు అనంతపురం 45, చిత్తూరు 433, తూర్పుగోదావరి 477, గుంటూరు 170, కడప 144, కృష్ణ 308, కర్నూలు 56, నెల్లూరు 248, ప్రకాశం 228, శ్రీకాకుళం 81, విశాఖపట్నం 77, విజయనగరం 23, పశ్చిమ గోదావరిలలో 152 మంది చొప్పున వైరస్ బారినపడ్డారు. 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
Humanoid Robot Introduced at Visakhapatnam Railway Station | Waltair Division | Asianet News Telugu