ఆ రెండు జిల్లాల్లో తగ్గని ఉద్థృతి: ఏపీలో కొత్తగా 10,548 కేసులు, 82 మరణాలు

By Siva KodatiFirst Published Aug 29, 2020, 6:57 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కి చేరుకుంది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా ఉగ్రరూపం కొనసాగుతూనే వుంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 10,548 కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. దీంతో కలిపి ఏపీలో మొత్తం కేసుల సంఖ్య 4,14,164కి చేరుకుంది.

గత 24 గంటల్లో కరోనా కారణంగా 82 మంది మృతి చెందడంతో మొత్తం మరణాల సంఖ్య 3,796కి చేరింది. ప్రస్తుతం ఏపీలో 97,681 యాక్టివ్ కేసులు ఉన్నాయి.

నిన్న ఒక్కరోజే 8,796 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దీంతో మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 3,12,687కి చేరింది. గత 24 గంటల్లో 62,024 మంది శాంపిల్స్‌ను పరీక్షించగా.. మొత్తం టెస్టుల సంఖ్య 36,03,345కి చేరుకుంది.

కరోనా కారణంగా చిత్తూరు 15, నెల్లూరు 11, తూర్పు గోదావరి 8, పశ్చిమ గోదావరి 8, అనంతపురం 6, గుంటూరు 6, కర్నూలు 6, ప్రకాశం 5, విశాఖపట్నం 5, శ్రీకాకుళం 4, విజయనగరం 4, కడప 2, కృష్ణా జిల్లాలో ఇద్దరు చొప్పున మరణించారు.

నిన్న ఒక్కరోజే తూర్పుగోదావరి జిల్లాలో 1,096 కేసులు నమోదయ్యాయి. ఆ తర్వాత అనంతపురం 864, చిత్తూరు 813, గుంటూరు 635, కడప 991, కృష్ణ 362, కర్నూలు 791, నెల్లూరు 1,038, ప్రకాశం 870, శ్రీకాకుళం 522, విశాఖపట్నం 988, విజయనగరం 715, పశ్చిమ గోదావరిలలో 863 కేసులు వెలుగు చూశాయి., 

 

: 29/08/2020, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 4,11,269 పాజిటివ్ కేసు లకు గాను
*3,09,792 మంది డిశ్చార్జ్ కాగా
*3,796 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 97,681 pic.twitter.com/NHasJ69JIn

— ArogyaAndhra (@ArogyaAndhra)

 

click me!