మూడు జిల్లాల్లో విజృంభిస్తోన్న కరోనా: ఏపీలో 8,90,317కి చేరిన కేసుల సంఖ్య

By Siva KodatiFirst Published Mar 4, 2021, 7:30 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 102 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,90,317కి చేరింది.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు నిలకడగా కొనసాగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో ఏపీలో కొత్తగా 102 మందికి పాజిటివ్‌గా తేలినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది.

వీటితో కలిపి రాష్ట్రంలో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడిన వారి సంఖ్య 8,90,317కి చేరింది. కరోనా కారణంగా నిన్న చిత్తూరులో ఒకరు మరణించారు. దీనితో కలిపి ఏపీలో వైరస్ బారినపడి ప్రాణాలు కోల్పోయిన వారి సంఖ్య 7171కి చేరింది.

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ ఆసుపత్రుల్లో 871 మంది చికిత్స పొందుతున్నారు. గడిచిన 24 గంటల్లో 56 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. వీరితో కలిపి ఇప్పటి వరకు మొత్తం డిశ్చార్జ్‌ల సంఖ్య 8,82,275కి చేరింది.

నిన్న 45,077 మందికి కరోనా నిర్థారణా పరీక్షలు నిర్వహించడంతో ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం టెస్టుల సంఖ్య 1,40,92,251కి చేరుకుంది.

గడిచిన 24 గంటల్లో అనంతపురం 4, చిత్తూరు 25, తూర్పు గోదావరి 13, గుంటూరు 5, కడప 2, కృష్ణా 8, నెల్లూరు 6, ప్రకాశం 3, శ్రీకాకుళం 3, విశాఖ 22, విజయనగరం 0, పశ్చిమ గోదావరిలలో మూడు కేసుల చొప్పున నమోదయ్యాయి.  


 

: 04/03/2021, 10:00 AM
రాష్ట్రం లోని నమోదైన మొత్తం 8,87,422 పాజిటివ్ కేసు లకు గాను
*8,79,380 మంది డిశ్చార్జ్ కాగా
*7,171 మంది మరణించారు
* ప్రస్తుతం చికిత్స పొందుతున్నవారి సంఖ్య 871 pic.twitter.com/FbmZHSvBkB

— ArogyaAndhra (@ArogyaAndhra)
click me!