ఏపీ మున్సిపల్ ఎన్నికలు: బెజవాడలో ఎంఐఎం పోటీ, ఒవైసీ కీలక నిర్ణయం

Siva Kodati |  
Published : Mar 04, 2021, 06:53 PM IST
ఏపీ మున్సిపల్ ఎన్నికలు: బెజవాడలో ఎంఐఎం పోటీ, ఒవైసీ కీలక నిర్ణయం

సారాంశం

బెజవాడ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. అభ్యర్ధులకు మద్ధతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ ప్రచారం చేస్తున్నారు. 

బెజవాడ రాజకీయాల్లోకి ఎంఐఎం ఎంట్రీ ఇచ్చింది. పశ్చిమ నియోజకవర్గంలో రెండు డివిజన్లలో ఎంఐఎం పోటీ చేస్తోంది. అభ్యర్ధులకు మద్ధతుగా నాంపల్లి ఎంఐఎం ఎమ్మెల్యే హుస్సేన్ ప్రచారం చేస్తున్నారు. 

కొంతకాలం క్రితం వరకు హైదరాబాద్‌కు మాత్రమే పరిమితమైందని భావించిన ఎంఐఎం నెమ్మదిగా దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పాగా వేస్తోంది. మహారాష్ట్రలో ఒక ఎంపీ సహా రెండు ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకున్న ఎంఐఎం.. కొద్ది రోజుల క్రితం జరిగిన బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో 5 ఎమ్మెల్యే స్థానాలను గెలుచుకుంది.

ఇక మొదటిసారి గుజరాత్‌లో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి దిగి మంచి ఫలితాలు రాబడుతోంది. తాజాగా ఏపీలోనూ మజ్లిస్ ఎంట్రీ ఇవ్వడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

PREV
click me!

Recommended Stories

Annadata Sukhibhava-PM Kisan Funds | రైతులకు ఎగిరి గంతేసే వార్త స్పాట్ లో నే అకౌంట్ లోకి డబ్బులు
Yogandhra 2026: సీఎం చంద్రబాబుని ఆకట్టుకున్న ధూమపానం హానికరం వినూత్న ప్రమోషన్| Asianet News Telugu