ఆసీస్ బలంగానే ఉంది.. కప్తోనే ఇంటికి వెళ్తాం: కోహ్లీ
ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫితోనే ఇంటికి వెళ్తామన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. సిడ్నీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కోహ్లీ... టిమ్ పెయిన్ సారథ్యంలోని జట్టు బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు.
ఆస్ట్రేలియాను ఓడించి బోర్డర్-గవాస్కర్ ట్రోఫితోనే ఇంటికి వెళ్తామన్నారు టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ. సిడ్నీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడిన కోహ్లీ... టిమ్ పెయిన్ సారథ్యంలోని జట్టు బలంగానే ఉందని అభిప్రాయపడ్డాడు. అయితే ఆసీస్ జట్టుతో ఆడిన అనుభవాన్ని సిరీస్లో ఉపయోగిస్తామన్నాడు.
ఆ జట్టు ఆడే విధానాన్ని వార్మప్ మ్యాచుల్లో పరిశీలిస్తున్నాం.. సిరీస్ గెలుచుకునే స్వదేశానికి వెళతామని ఆశాభావం వ్యక్తం చేశాడు. నైపుణ్యం, అనుభవం, ఆటపరంగా ఆసీస్ గడ్డపై సిరీస్ గెలిచే సత్తా భారత్కు ఉందన్నాడు. ప్రతి సిరీస్, ప్రతి పర్యటన, ప్రతి ఆట తనకు ఎన్నో గుణపాఠాలు నేర్పిందన్నాడు.
జట్టు ప్రయోజనాల కోసం నూటికి నూరు శాతం కష్టపడతానని కోహ్లీ స్పష్టం చేశాడు. 2014లో ధోని నాయకత్వంలోని జట్టును ఓడించి ఆసీస్ బోర్డర్-గవాస్కర్ ట్రోఫిని కైవసం చేసుకుంది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆసీస్ స్టార్ ప్లేయర్లు స్టివ్ స్మిత్, డేవిడ్ వార్నర్లు లేకపోవడంతో ఆ జట్టు బ్యాటింగ్ బలహీనంగా కనిపిస్తోంది.
నేను చనిపోలేదు.. బ్రతికే ఉన్నాను.. మాజీ క్రికెటర్
మిథాలీ ఎఫెక్ట్: రమేశ్ పొవార్పై వేటు..?
ఆసీస్ తో ఢీ: భారత్ కు షాక్, పృథ్వీషాకు మోకాలి గాయం
నిక్కరుతో టాస్...మరో వివాదంలో విరాట్ కోహ్లీ
నాకిది చీకటి రోజు, దేశభక్తిని శంకించారు: మిథాలీ రాజ్
మిథాలీపై వేటు.. ధోనీ, కోహ్లీలను ఇలా చేసే దమ్ముందా..?
చెత్త స్ట్రైక్ రేట్: మిథాలీపై రమేష్ పొవార్ తీవ్ర వ్యాఖ్యలు
మిథాలీ పై వేటు.. స్పందించిన ఫరూఖ్ ఇంజినీర్
అవమానించాడు: రమేష్ పొవార్ పై బిసిసిఐకి మిథాలీ లేఖ
26/11 ముంబయిపై దాడి: టీమిండియా పరిస్థితి ఇది
మిథాలీని ఎందుకు తప్పించావ్... హర్మన్ ప్రీత్పై బీసీసీఐ ఆగ్రహం