నాన్న కోసం చిన్నారి కంటతడి... వైరల్ వీడియో వెనక కథ ఇదే..!

By telugu news teamFirst Published Dec 14, 2023, 11:10 AM IST
Highlights

ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి శబరిమల వచ్చాడు. అయితే,  విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది యాత్రికులు అయ్యప్ప దర్శనం పొందకుండానే పందళం నుండి తిరిగి వెళ్లిపోతున్నారు. 


శబరిమల అయ్యప్పను దర్శించుకోవడానికి ఈ సమయంలో భక్తులు పోటెత్తూ ఉంటారు. ఇప్పటికే.. అక్కడ భక్తుల రద్దీ గురించి మనకు చాలా వార్తలు  వస్తూనే ఉన్నాయి. ఈక్రమంలోనే నెట్టింట ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో చూసి చాలా మంది కంటతడి కూడా పెట్టేశారు. తన తండ్రి కోసం ఓ చిన్నారి బాలుడు ఏడుస్తూ, అందరినీ ప్రాధేయపడుతున్న వీడియో ఇది. ఇప్పుడు ఆ వీడియో చూసినా, బాధగానే అనిపిస్తుంది. అసలుు అక్కడ జరిగింది ఏంటి..? ఆ వీడియో తర్వాత జరిగింది ఏంటో కూడా ఓసారి చూద్దాం..

ఇంతకీ ఆ వీడియోలో అసలు ఏం జరిగిందంటే... ప్రతి సంవత్సరం ఈ డిసెంబర్, జనవరి సమయంలో అయ్యప్ప భక్తులు శబరిమలకు పోటెత్తుతూ ఉంటారు. ఓ వ్యక్తి తన కుమారుడితో కలిసి శబరిమల వచ్చాడు. అయితే,  విపరీతమైన రద్దీ కారణంగా చాలా మంది యాత్రికులు అయ్యప్ప దర్శనం పొందకుండానే పందళం నుండి తిరిగి వెళ్లిపోతున్నారు. ఈ క్రమంలోనే ఓ బాలుడు బస్సలో ఉన్నాడు. ఆ బస్సు కూడా ఫుల్ రష్ గా ఉంది. అంత మందిలో ఆ బాలుడికి తన తండ్రి కనిపించలేదు. దీంతో గట్టిగా ఏడ్చేశాడు. బస్సు కదులుతోందని, తన తండ్రి పక్కన లేడని చాలా గట్టిగా ఏడుస్తాడు.  కిటికీలో నుంచి చూస్తూ.. కింద ఉన్న పోలీసులను కూడా వేడుకున్నాడు. నాన్న కావాలి అంటూ ఆ బాలుడు ఏడ్చిన వీడియో... సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

ఆ వీడియో తర్వాత ఏం జరిగింది అనేది మాత్రం బయటకు రాలేదు. కానీ, ఆ బాలుడి తండ్రి కూడా అదే బస్సులోనే ఉన్నాడట. అంత మందిలో ఆ బాబుకి కనపడలేదు అంతే. కాసేపటికే ఆ బాబుకి వాళ్ల నాన్న కనిపించాడట. ఆ బాలుడిని వాళ్ల నాన్నకు అప్పగించేశారట. వాళ్ల నాన్న కనిపించిన తర్వాత ఆ బాబు సంతోషంతో చిందులు వేశాడు. అక్కడి పరిస్థితిని జస్ట్ కొన్ని నిమిషాల్లోనే పోలీసులు కంట్రోల్ చేయడం విశేషం. 

click me!