భద్రాద్రి రామయ్య కళ్యాణం... పట్టువస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి

Mar 30, 2023, 1:13 PM IST

భద్రాచలం : శ్రీరామ నవమిని పురస్కరించుకుని భద్రాచలంలో సీతారాముల కళ్యాణం కన్నుల పండగగా జరుగుతోంది. మిథిలా స్టేడియంలో జరిగే స్వామివారి కళ్యాణాన్ని కనులారా చూసి తరించేందుకు భారీగా భక్తులు భద్రాచలం చేరుకుంటున్నారు. దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి కూడా సతీసమేతంగా భద్రాచలం ఆలయానికి చేరుకుని పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మంత్రి దంపతులకు ఆలయ అర్చకులు, అధికారులు మేళతాళాలతో తీసుకునివెళ్లారు.