సాగు చట్టాలు: మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. హిందీలో కేసీఆర్ ప్రకటన (వీడియో)

సాగు చట్టాలు: మరణించిన రైతుల కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా.. హిందీలో కేసీఆర్ ప్రకటన (వీడియో)

Siva Kodati |  
Published : Nov 20, 2021, 09:44 PM IST

రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని ప్రధాని నరేంద్రమోడీకి కేసీఆర్ సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ  తరపు నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతుల పోరాటంతోనే కేంద్రం తీసుకువచ్చిన నూతన వ్యవసాయ చట్టాలు (Farm laws) రద్దయ్యాయన్నారు తెలంగాణ సీఎం కేసీఆర్ (telangana cm kcr) . శనివారం తెలంగాణ భవన్‌లో (telagana bhavan) మీడియాతో మాట్లాడిన ఆయన.. చట్టాలు రద్దు చేసినట్లుగానే, రైతులపై దేశవ్యాప్తంగా నమోదైన కేసులను ఎత్తివేయాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని (narendra modi) కేసీఆర్ కోరారు. రైతు ఉద్యమంలో మరణించినవారి కుటుంబాలను ఆదుకోవాలని ఆయన సూచించారు. ఉద్యమంలో మరణించిన రైతు కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వ  తరపు నుంచి రూ.3 లక్షల పరిహారం అందించనున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు.

రైతు పోరాటంలో మరణించిన 750 రైతుల కుటుంబాలకు సాయం అందించనున్నట్లు కేసీఆర్ హిందీలో ప్రకటించడం విశేషం. ఇప్పటికే పేర్లు ఇవ్వాలని రైతు సంఘం నాయకులకు సూచించినట్లు సీఎం తెలిపారు. సారీ చెప్పి చేతులు దులుపుకోవడం కాదని.. ప్రతి కుటుంబానికి కేంద్రం రూ.25 లక్షల పరిహారం ఇవ్వాలని.. కేసీఆర్ డిమాండ్ చేశారు. వ్యవసాయ రంగంలో కూడా ఆత్మనిర్భర్ (atma nirbhar bharat) అమలు చేయాలని ఆయన సూచించారు. 

24:53CM Revanth Reddy Pressmeet: కేంద్రంపై రెచ్చిపోయిన సీఎం రేవంత్ రెడ్డి | Asianet News Telugu
03:08ట్రంప్ మెచ్చిన తెలుగు మహిళ.. US పాలిటిక్స్ లో సంచలనం | Saritha Komatireddy | Donald Trump
04:24CM Revanth Reddy America Tour: సీఎం రేవంత్ రెడ్డి అమెరికా ప‌ర్య‌ట‌న‌ రద్దు అస‌లేం జ‌రిగిందంటే?
02:49Telangana rain alert: తెలుగు రాష్ట్రాల ప్రజలకు అలర్ట్ దూసుకొస్తున్న అల్పపీడనం | Asianet News Telugu
03:21Telangana Rain Alert: తెలంగాణలో 11 జిల్లాలకు ప్రత్యేక హెచ్చరిక...ఉరుములు, మెరుపుల‌తో భారీ వ‌ర్షాలు
07:06రెడ్‌ హ్యాండెడ్‌గా దొరికిన ఫోక్‌ డ్యాన్సర్లు | Eshwar Sai & Madhuri Rathod Viral Video
27:01సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ పై CM రేవంత్ రెడ్డి గూస్ బంప్స్ స్పీచ్| Sardar Sarvai Papanna Goud
10:53సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహావిష్కరించిన సీఎం రేవంత్ రెడ్డి | Sardar Sarvai Papanna Goud
20:48పేదవాడికి కార్పొరేట్‌ స్థాయి వైద్యంమే లక్ష్యం CM రేవంత్ రెడ్డి | Sanathnagar TIMS Hospital
06:12ములుగు సభలో స్పీచ్ అదరగొట్టిన మంత్రి సీతక్క | Asianet News Telugu
Read more