ప్రస్తుతం జరుగుతున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బహిష్కరించాలని బీఆర్ఎస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు, సభాపతి వైఖరికి నిరసనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. అలాగే రేపు తెలంగాణ భవన్లో పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వనున్నట్లు వెల్లడించారు.